Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్లు రెండు గుటకలు వేయగానే నోటికాడికి వచ్చిన కట్లపాము...

ఠాగూర్
శుక్రవారం, 17 జనవరి 2025 (10:22 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కల్లు తాగేందుకు వెళ్లగా అతనికి తేరుకోలేని షాకి తగిలింది. శారీరక ఉపశమనం కోసం కల్లు తాగేందుకు కల్లు దుకాణానికి వెళ్లి కల్లీ సీసాను కూలీ కొనుగోలు చేయగా, అందులో ఉన్న కట్లపామును చూసి షాక్‌కు గురయ్యాడు. గురువారం రాత్రి వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
నాగర్ కర్నూలు జిల్లాలోని లట్టుపల్లి గ్రామంలో గురువారం రాత్రి ఓ వ్యక్తి కల్లు దుకారణంలో కల్లు సీసా కొని, రెండు గుటకలు వేయడంతో అందులోని కట్లపాము నోటికికాడికి వచ్చింది. దానిని ఉమ్మివేయడంతో అందులో నుంచి సుమారు ఆరు ఇంచుల కట్లపాము బయటపడింది. 
 
ఇదంతా అక్కడే ఉన్న గ్రామస్తులంతా చూసి ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఇదేంటని కల్లీకల్లు తయారు చేసే యజమానిని ప్రశ్నించగా బిత్తిరి చూపులు చూశాడు. దీంతో కోపంతో రగిలిపోతూ గ్రామస్తులంతా కలిసి ఆ కల్లు దుకాణాన్ని, సీసాలను ధ్వంసం చేశారు. డబ్బులకు ఆశపడి కల్తీ కల్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ కల్లు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులంతా కలిసి ఆందోళనకు దిగారు. ఈ విషయం అబార్కీ శాఖ అధికారులకు చేరడంతో వారు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments