Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్లు రెండు గుటకలు వేయగానే నోటికాడికి వచ్చిన కట్లపాము...

ఠాగూర్
శుక్రవారం, 17 జనవరి 2025 (10:22 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కల్లు తాగేందుకు వెళ్లగా అతనికి తేరుకోలేని షాకి తగిలింది. శారీరక ఉపశమనం కోసం కల్లు తాగేందుకు కల్లు దుకాణానికి వెళ్లి కల్లీ సీసాను కూలీ కొనుగోలు చేయగా, అందులో ఉన్న కట్లపామును చూసి షాక్‌కు గురయ్యాడు. గురువారం రాత్రి వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
నాగర్ కర్నూలు జిల్లాలోని లట్టుపల్లి గ్రామంలో గురువారం రాత్రి ఓ వ్యక్తి కల్లు దుకారణంలో కల్లు సీసా కొని, రెండు గుటకలు వేయడంతో అందులోని కట్లపాము నోటికికాడికి వచ్చింది. దానిని ఉమ్మివేయడంతో అందులో నుంచి సుమారు ఆరు ఇంచుల కట్లపాము బయటపడింది. 
 
ఇదంతా అక్కడే ఉన్న గ్రామస్తులంతా చూసి ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఇదేంటని కల్లీకల్లు తయారు చేసే యజమానిని ప్రశ్నించగా బిత్తిరి చూపులు చూశాడు. దీంతో కోపంతో రగిలిపోతూ గ్రామస్తులంతా కలిసి ఆ కల్లు దుకాణాన్ని, సీసాలను ధ్వంసం చేశారు. డబ్బులకు ఆశపడి కల్తీ కల్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ కల్లు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులంతా కలిసి ఆందోళనకు దిగారు. ఈ విషయం అబార్కీ శాఖ అధికారులకు చేరడంతో వారు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments