ఎలుక కాటుకు 40 రోజుల చిన్నారి మృతి

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2023 (13:27 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఎలుక కాటుకు 40 రోజుల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, పట్టణంలోని నాగనూల్ గ్రామానికి చెందిన లక్ష్మీకళ, పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన శివ దంపతులకు 40 రోజుల క్రితం మగశిశువు జన్మించాడు. అప్పటి నుంచి లక్ష్మికళ ఇంటిపట్టునే ఉంటూ తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తుంది. 
 
అయితే, శనివారం రాత్రి నేలపై పడుకున్న లక్ష్మి... తన పక్కలోనే బిడ్డను పండబెట్టుకుంది. అయితే, అర్థరాత్రి సమయంలో ఆ పసికందును ఎలుక కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆలస్యంగా ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు పసికందును ఆగమేఘాలపై ఆస్పత్రికి
తీసుకెళ్లి నీలోఫర్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశాడు. 
 
కన్నబిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు కూడా విచారణ వ్యక్తం చేస్తున్నారు. పైగా, ఎలుక కరవడం వల్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవడమాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

Aari: అరి సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉందన్నారు : డైరెక్టర్ జయశంకర్

మటన్ సూప్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా: డైరెక్టర్ వశిష్ట

కరూర్ తొక్కిసలాట సమిష్ట వైఫల్యం : రిషబ్ శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments