Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రాముడికి సికింద్రాబాద్ నుంచి భారీ లడ్డు

వరుణ్
బుధవారం, 17 జనవరి 2024 (11:31 IST)
అయోధ్య రాముడికి సికింద్రాబాద్ నుంచి భారీ లడ్డూ వెళ్లింది. 1265 కేజీల బరువుతో ఈ లడ్డూను సికింద్రాబాద్ నగరానికి చెందిన శ్రీరామ్ క్యాటరర్స్ తయారు చేసింది. ఈ లడ్డూను బుధవారం ఉదయం శోభాయాత్రగా బయలుదేరి వెళ్లింది. ఈ నెల 21వ తేదీ నాటికి ఈ లడ్డూ రాముడి సన్నిధికి చేరుకుంటుందని శ్రీరామ్ క్యాటరర్స్ యజమాని వెల్లడించారు. 
 
రాముడు గుడికి భూమి పూజ జరిగిన నాటి నుంచి ప్రాణప్రతిష్ట ముహూర్తం రోజు వరకు మొత్తం 1265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగా శ్రీరామ్ క్యాటరర్స్ 1265 కేజీల బరువుతో ఈ లడ్డూను తయారు చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నుంచి ముందుగా అనుమతి పొంది, స్వామి వారికి నైవేధ్యంగా సమర్పించేందుకు ఈ భారీ లడ్డూను సిద్ధం చేసినట్టు శ్రీరామ్ క్యాటరర్స్ యజమాని నాగభూషణం రెడ్డి తెలిపారు. ఈ భారీ లడ్డూతో పాటు మరో ఐదు చిన్న లడ్డూలను కూడా తయారు చేశామని తెలిపారు. ఈ లడ్డూలను అయోధ్యకు చేర్చేందుకు బుధవారం శోభాయాత్రను ప్రారంభించగా, ఇది ఈ నెల 21వ తేదీ నాటికి అయోధ్యకు చేరుకుంటుంది. 
 
కాగా, ఈ భారీ లడ్డూ తయారీకి 350 కేజీల శెనగపిండి, 700 కేజీల చక్కెర, 40 కిలోల నెయ్యి, 40 కిలోల కాజు, 30 కిలోల కిస్మిస్, 15 కేజీల బాదం, 10 కేజీల పిస్తా, 32 గ్రాముల కుంకుమ పుప్వును వినియోగించినట్టు ఆయన వివరించారు. ఈ లడ్డూను శ్రీరాముడి గుడికి 50 మీటర్ల దూరంలో ప్రదర్శనకు ఉంచుతారని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ప్రసాదం పంచుతారని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments