అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం.. కేసీఆర్ ప్రకటన..!

Webdunia
శనివారం, 21 ఫిబ్రవరి 2015 (15:55 IST)
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలను త్యాగం చేసిన అమర వీరులు ఒక్కొక్క కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ మొత్తం వెంటనే ఆయా కుటుంబాలకు అందే విధంగా చర్యలు చేపడతామని కేసీఆర్ తెలిపారు. 
 
అంతేకాకుండా వీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయంపై సదరు జిల్లాల మంత్రులు, కలెక్టర్లు సమీక్ష చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే కుటుంబంలో ఎవరికి ఉద్యోగం కల్పించాలన్న విషయంపై కుటుంబసభ్యులే నిర్ణయించుకోవాలన్నారు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం వద్దంటే ప్రత్యామ్నాయ ఉపాధి చూపుతామని కేసీఆర్ వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకరత్న దాసరి సమాధిని శుభ్రం చేసిన మంచు మనోజ్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Show comments