Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నీతి ఆయోగ్' పరిధిలో సబ్ కమిటీ వేయాలి... కేసీఆర్

Webdunia
సోమవారం, 9 ఫిబ్రవరి 2015 (09:42 IST)
కేంద్ర పథకాల కొనసాగింపుపై నీతి ఆయోగ్ పరిధిలో సబ్ కమిటీని వేయాలని కేంద్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కోరారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన 'నీతి ఆయోగ్' తొలి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రాల అవసరాలను కేంద్రానికి వివరించారు. స్థానిక అవసరాలకు తగినట్టుగా నిధులను మంజూరు చేయాలని కేసీఆర్ కోరారు. 
 
దేశంలోని అన్ని రాష్ట్రాలలో కేంద్ర పథకాల యదాతథంగా కొనసాగించే విధంగా నీతి ఆయోగ్ పరిధిలో సబ్ కమిటీని వేయాలని కేసీఆర్ కోరారు. ఈ అంశంపై కేసీఆర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించినట్టు సమాచారం. రాష్ట్రంలో అమలు చేస్తున్న వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ వంటి పథకాలకు కేంద్రం భారీగా నిధులు ఇవ్వాలని సమావేశంలో కోరారు. 
 
కాగా సమావేశ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్బంధ విద్య అమలు, బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణం వంటి పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలని మోడీని కోరినట్టు కేసీఆర్ వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

Show comments