Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెట్టిచాకిరీ కేసు... టీ సీఎం కార్యాలయ కార్యదర్శ స్మితా సబర్వాల్‌కు వారెంట్

Webdunia
శనివారం, 6 డిశెంబరు 2014 (10:24 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు వహిస్తున్న స్మితా సభర్వాల్‌కు ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లె ఫస్ట్ క్లాస్ కోర్టు గురువారం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 15లోగా ఆమె కోర్టుకు హాజరు కావాలని మెజిస్ట్రేట్ ప్రదీప్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. 
 
గత 2003లో స్మితదాస్ మదనపల్లె సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు వహించారు. ఆ రోజుల్లో కొండామర్రిపల్లె సమీపంలో గాయిత్రీస్టోన్ క్రషర్స్‌లో 39 మంది కూలీలకు తక్కువ జీతం ఇస్తూ వారితో వెట్టిచాకిరీ చేయిస్తుండడంతో గుర్తించిన స్మితదాస్ యజమాన్యం క్రిష్ణమూర్తి, శ్రీనివాసులుపై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వెట్టిచాకిరీ చేస్తున్న వారికి విముక్తి కల్పించారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో వుంది.
 
కాగా 2009 నుంచి స్మితదాస్ కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో మదనపల్లె ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేశారు. స్మితాదాస్ 2003 నుంచి 2009 వరకు మదనపల్లె కోర్టుకు హాజరైన స్మితాదాస్‌, ఆ తరువాత నాలుగేళ్లుగా కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఈనెల 15వ తేదీ లోపు తప్పకుండా కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆమెకు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments