Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదవులిస్తే సైలెంట్ అవుతరు మన సన్నాసులు: కేసీఆర్

Webdunia
శనివారం, 7 జనవరి 2012 (21:00 IST)
కుక్కలకు బొక్కలేసినట్లు మన ప్రాంత నాయకులకు పదవులిస్తే సైలెంటవుతరని తెరాస చీఫ్ కేసీఆర్ తెలంగాణ ప్రాంత నాయకులను విమర్శించారు. పదవులకు రాజీనామా చేయని ఇక్కడి నాయకులు దద్దమ్మలు, సన్నాసులు అనీ, ఇంకా ఈ మాటలకంటే ఎక్కువైన పదాలేమైనా ఉంటే అవి వారికి వర్తిస్తాయని మండిపడ్డారు.

తెలంగాణ లెక్చరర్ల డైరీ ఆవిష్కరణ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నాలుగు దశాబ్దాలుగా తెలంగాణలోని అన్ని వనరులను సీమాంధ్ర పాలకులు దోచుకుంటూనే ఉన్నారన్నారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావన్నారు. చంద్రబాబు ఏదో చేస్తానని రాళ్లు నాటి పోతే.. వైఎస్సార్ వచ్చి మొక్కలు నాటిండు.. అంతే తప్ప తెలంగాణకు మాత్రం నీళ్లు రాలేదు.

మిగులు జలాలను తరలించుక పోతూనే ఉంటుండ్రు. మన ప్రజాప్రతినిధులు దద్దమ్మలు కాబట్టే సీమాంధ్రుల నిర్వాకం సాగుతోందని కేసీఆర్ మండిపడ్డారు. సీమాంధ్రులు చిట్టచివరి వరకూ ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తూనే ఉంటారనీ, కనుక ఎవరూ ఎటువంటి తికమకలకు గురి కాకుండా తెలంగాణ లక్ష్యంగా ముందుకు ఉరకాలని పిలుపునిచ్చారు.

ఇక తెలుగుదేశం పార్టీ.. ఆ పార్టీకి ఇక నుంచి ఏ ఎన్నికలో అయినా తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు చేసే చిల్లర రాజకీయాలు ఇక నుంచి చెల్లవన్నారు. ప్రజాక్షేత్రంలో తెదేపా భూస్థాపితం కావడం ఖాయమన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments