Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా ద్రోహుల వల్లే రాజీనామాలు: మధుయాష్కీ

Webdunia
మంగళవారం, 19 జులై 2011 (19:43 IST)
FILE
తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కి కాంగ్రెస్ అధినాయకులపైనా, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంపైన విరుచుక పడ్డారు. తెలంగాణా అంశాన్ని నాన్చుతూ పోతే చల్లబడిపోతుందని కొంతమంది తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్లనే తెలంగాణా ఏర్పాటు జాప్యం అవుతోందని మండిపడ్డారు.

ముఖ్యంగా ఇటీవల ఉపముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న దామోదర రాజనరసింహ తెలంగాణా ద్రోహి అని తీవ్రంగా విమర్శించారు. ఆయనేదో తెంలగాణాను అభివృద్ధి చేస్తే సమస్య తీరిపోతుందని హైకమాండ్ వద్ద తప్పుడు మాటలు చెప్పి ఉద్యమాన్ని బలహీనం చేయాలని కుట్ర పన్నారన్నారు.

ఇక కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం తెలంగాణాపై చేసిన తప్పుడు ప్రకటనల వల్లనే తాము రాజీనామాల దాకా రావలసి వచ్చిందన్నారు. ఇప్పుడు సంప్రదింపులు, మూడు ప్రాంతాల వారితో మాట్లాడాలన్న సంగతి 2004లో గులాంనబీ ఆజాద్ కు తెలియవా అని ప్రశ్నించారు. ఆనాడు తెలంగాణా అంశాన్ని మ్యానిఫెస్టోలో ఎందుకు ప్రవేశపెట్టారంటూ ప్రశ్నించారు.

తెలంగాణాకు ప్రాణహిత - చేవెళ్ల రెండూ ఇస్తే ఉద్యమం ఆగిపోతుందని వారనుకుంటున్నారనీ, అయితే ప్రపంచంలో ఏ ఉద్యమాన్ని ఎవరూ, ఆఖరికి నియంతలు సైతం అడ్డుకోలేకపోయారని గుర్తు చేశారు. ఉద్యమాన్ని ఆపాలని చూస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించారు.

ఇప్పటికైన గులాంనబీ ఆజాద్ తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కనపెట్టి తెలంగాణా ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకునే విధంగా అధిష్టానానికి సూచించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తెలంగాణాపై అనుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments