Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా కాంగ్రెస్ నాయకులు యాచకులు: జయశంకర్

Webdunia
WD
తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దర్జాగా కుర్చీలో కూచోమని కాంగ్రెస్ నేతలకు చెపితే యాచకుల మాదిరిగా ఉపముఖ్యమంత్రి పదవికోసం తిరుగుతున్నారనీ, వీరి వల్ల తెలంగాణా రాష్ట్ర సాధ్యమవుతుందనే విశ్వాసం తనకు లేదని ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు.

తెలంగాణా రాష్ట్రం రాకపోతే మనపై దోపిడీ జరుగుతూనే ఉంటుంది. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణాకు అనుకూలంగా ఇచ్చినా లేకపోయినా రాష్ట్రం వచ్చేవరకూ ఎట్టి పరిస్థితిల్లోనూ రాజీపడేది లేదని జయశంకర్ తెలిపారు.

తెలంగాణాలోని కాంగ్రెస్ నాయకులు, తెలుగుదేశం నాయకులు యాచకులు మాదిరిగా మారినా తెలంగాణా ప్రజలు మాత్రం అలా లేరనీ, తమ హక్కులను పోరాటం ద్వారా సాధించుకు తీరుతారని అన్నారు. ఉద్యమ సాధనలో ఇంత దూరం వచ్చాక ఇక తిరిగి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

భవిష్య తరాల బంగారుమయం కావాలంటే తెలంగాణా రాష్ట్రం వచ్చి తీరాలని అన్నారు. అందుకోసం యువత నడుం బిగించాలని, పట్టు విడవని పోరాటం చేయాలన్నారు. అయితే ఆ పోరాటం ఎలా ఉంటుందో డిసెంబరు 31 తర్వాత ఉద్యమ నేతలు నిర్ణయిస్తారని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

Naresh: అల్లరి నరేష్ కథానాయకుడిగా ఆల్కహాల్ టైటిల్ ఖరారు

శ్రీహరి కొడుకు ధనుష్ హీరోగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్ చేసిన వినాయక్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments