Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సీఎం అయితే తెలంగాణ నోట్లో మట్టే... కేసీఆర్

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2012 (20:50 IST)
FILE
జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రజల నొట్లో మట్టి కొడతాడని తెరాస చీఫ్ కేసీఆర్ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే రెండేళ్లలో పోలవరం కడతాడని విజయమ్మ కబుర్లు చెపుతున్నారనీ, ఇవన్నీ తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు చెపుతున్న మాటలని ఆయన కొట్టి పారేశారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్ర బడ్జెట్ రూ. 85 వేల కోట్ల బడ్జెట్ ఉంటుందని చుక్కలు చూపిస్తూ చెప్పుకొచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిరంతరాయంగా విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... వలసవాదులు తెలంగాణను దోచుకునేందుకు అనునిత్యం ప్రణాళికలు రచిస్తూనే ఉంటారనీ, వారి మాటలకు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. డిసెంబరు 28న జరిగే అఖిలపక్షంలో కాంగ్రెస్, తెదేపా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోతే భూస్థాపితం చేస్తామన్నారు.

వచ్చే ఎన్నికల్లో తెరాస 100 ఎమ్మెల్యే సీట్లను, 15 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. తమ సత్తాతోనే తెలంగాణ వచ్చే దాకా అలుపెరుగని పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు కేసీఆర్.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments