Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు.. ఎందుకంటే?

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2023 (14:58 IST)
మంత్రి కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. టీ-వర్క్స్‌లో నిరుద్యోగులతో కేటీఆర్ ముఖాముఖిపై ఫిర్యాదులు అందడంతో చర్యలు తీసుకున్నారు. దీనిపై ఈసీ కేటీఆర్‌ను వివరణ కోరింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్‌కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 
 
మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వ కార్యాలయమైన టీ-వర్క్స్‌ను ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయమైన టీ-వర్క్స్‌లో నిరుద్యోగులను కేటీఆర్ ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారని ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జీవాలా ఈసీకి ఫిర్యాదు చేశారు. మంత్రి కేటీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని రణదీప్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన ఈసీ.. మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. 
 
టీ-వర్క్స్‌లో జరిగిన ఇంటర్వ్యూలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం కేటీఆర్‌ను కోరింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అశోక్ నగర్ వెళ్లి యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులతో సమావేశమవుతానని మంత్రి కేటీఆర్ ఇటీవల యువతకు హామీ ఇచ్చారు.
 
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తానని కేటీఆర్ వెల్లడించారు. అనంతరం ఎన్నికలు, ఓట్లు, పార్టీల గురించి మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు.
 
 
 
ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న తరుణంలో కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయమైన టీ-వర్క్స్‌ కేంద్రాన్ని రాజకీయ కార్యక్రమాలకు ఎలా ఉపయోగించుకుంటారని ప్రతిపక్షాలు సైతం కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అన్ని విషయాలను పరిశీలించిన ఈసీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments