Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్లలో చేసిందేమీ లేదు.. బైబై కేసీఆర్.. ప్రియాంకా గాంధీ

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (16:03 IST)
Priyanka Gandhi
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. ప్రచారానికి నేటితో తెరపడింది. బహిరంగసభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, ర్యాలీలు, పాదయాత్రలతో హోరెత్తిన తెలంగాణ ఇవాళ్టితో మూగబోనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జహీరాబాద్‌లో పర్యటిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా ఆమె బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని చెప్పారు. 
 
కర్ణాటక మహిళల తరహాలో ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. ధరణితో రైతుల కష్టాలు పెరిగాయన్నారు. రుణమాఫీ కాలేదని, ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని చెప్పారు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదని ఆరోపించారు. 
 
తెలంగాణలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని.. అవినీతి తాండవం చేస్తుందని.. ధనిక పార్టీ అయిన బీఆర్ఎస్‌ను తెలంగాణ నుంచి వెళ్లగొట్టాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. బైబై కేసీఆర్.. మార్పు రావాలని పునరుద్ఘాటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments