Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్లలో చేసిందేమీ లేదు.. బైబై కేసీఆర్.. ప్రియాంకా గాంధీ

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (16:03 IST)
Priyanka Gandhi
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. ప్రచారానికి నేటితో తెరపడింది. బహిరంగసభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, ర్యాలీలు, పాదయాత్రలతో హోరెత్తిన తెలంగాణ ఇవాళ్టితో మూగబోనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జహీరాబాద్‌లో పర్యటిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా ఆమె బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని చెప్పారు. 
 
కర్ణాటక మహిళల తరహాలో ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. ధరణితో రైతుల కష్టాలు పెరిగాయన్నారు. రుణమాఫీ కాలేదని, ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని చెప్పారు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదని ఆరోపించారు. 
 
తెలంగాణలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని.. అవినీతి తాండవం చేస్తుందని.. ధనిక పార్టీ అయిన బీఆర్ఎస్‌ను తెలంగాణ నుంచి వెళ్లగొట్టాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. బైబై కేసీఆర్.. మార్పు రావాలని పునరుద్ఘాటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments