Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ ధ‌ర్మాన్ని ర‌క్షించాల‌నుకుంటే బీజేపీకే ఓటు వేయండి : స్వామి ప‌రిపూర్ణానంద‌

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (18:35 IST)
మ‌ల్కాజ్‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న ఎన్. రామ‌చంద్ర‌రావు ప్ర‌చారంలో స్పీడు పెంచారు. స్ధానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి చాలా ఉత్సాహంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఎన్.రామ‌చంద్ర‌రావు మాట్లాడుతూ… ఇప్ప‌టికే రెండుసార్లు పాద‌యాత్ర‌లు చేసాం. రోడ్ షాలు చేసాం. ఇంటింటికి వెళ్లి కూడా ప్ర‌చారం చేస్తున్నాం. కార్య‌క‌ర్త‌లు చాలా ఉత్సాహంగా నిద్ర అనేది లేకుండా ప‌ని చేస్తున్నారు. త‌ప్ప‌కుండా ప్ర‌జ‌లు మా క‌ష్టాన్ని త‌గ్గ‌ట్టు ఓటు వేసి గెలిపిస్తార‌ని భావిస్తున్నాం అని చెప్పారు.
 
ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న‌ స‌మ‌స్య‌ల‌ను ఖ‌చ్చితంగా ప‌రిష్కారిస్తాన‌ని హామీ ఇస్తున్నాను అని అన్నారు. లోతుకుంట నుంచి ఓల్డ్ అల్వాల్‌లో గ‌ల ఐజీ విగ్ర‌హం వ‌ర‌కు దేశం కోసం ధ‌ర్మం కోసం అంటూ స్వామి ప‌రిపూర్ణానంద‌తో క‌లిసి ఎన్. రామ‌చంద్ర‌రావు రోడ్ షో నిర్వ‌హించారు. ఈ రోడ్ షోలో స్వామి ప‌రిపూర్ణానంద మాట్లాడుతూ… ఎవ‌రైతే హిందు ధ‌ర్మాన్ని ర‌క్షించాల‌నుకుంటున్నారో వాళ్లు బీజేపీకి ఓటు వేయాల‌ని పిలుపునిచ్చారు. ఒక‌వేళ టీఆర్ఎస్‌కి ఓటు వేస్తే ఎంఐఎంకి ఓటు వేసిన‌ట్టే అని చెప్పారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments