Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎన్నికల్లో వేలు పెట్టండి.. ఎవరు వద్దన్నారు.. నారా లోకేష్

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (10:32 IST)
ఆంధ్రప్రదేశ్‌కు కేసీఆర్, కేటీఆర్ సహా ఎవరైనా రావొచ్చునని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో అనవసరంగా జోక్యం చేసుకున్నారని.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తాము వేలుపెడతామని తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో.. నారా లోకేష్ కౌంటరిచ్చారు.
 
ఏపీలో ప్రజాస్వామ్యం వుందని.. అక్రమ అరెస్టులు, వేధింపులు, రౌడీయిజంలు లేవని చెప్పారు. కావాలనుకుంటే.. కేటీఆర్ ఆంధ్రాలోనూ ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చునని ఎద్దేవా చేశారు. 
 
రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని.. ఇలాంటి చర్యలను ప్రజలు ఎన్నటికీ అంగీకరించరన్నారు. డిసెంబర్ 11న వెలువడనున్న ఎన్నికల్లో మహా కూటమి విజయఢంకా మోగిస్తుందని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నారన్న టీఆర్ఎస్ నేతల ఆరోపణలను మంత్రి ఖండించారు. అభివృద్ధి చేపట్టడం చేతకాక కేసీఆర్ సర్కారు తమపై అభాండాలు వేస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments