Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేస్టీ స్వీట్... బాదంపప్పు-ఎండుఖర్జూరం పాయసం

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (23:01 IST)
బాదం పప్పుల్లో బ్లీచింగ్‌ కారకాలు అధికం. ఇవి చర్మంలోని మృతకణాలను తొలగిస్తాయి. పెద్దపేగులోని సమస్యలకు ఖర్జూరం పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందు. అలాగే డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు దీని కాండం నుంచి తీసిన జిగురును వాడతారు. చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పీ తగ్గుతుంది.
 
కావలసిన పదార్థాలు :
ఎండు ఖర్జూరం తరుగు.. పావు కప్పు
బాదం పప్పు.. పావు కప్పు
ఎండుకొబ్బరి కోరు.. పావు కప్పు
పాలు.. మూడు కప్పులు
కలాకండ్.. ఒక టీ.
పంచదార.. పావు కప్పు
మరిగించి చల్లార్చిన పాలు.. అర కప్పు
యాలకుల పొడి.. అర టీ.
 
తయారీ విధానం :
తరిగిన ఖర్జూరం, బాదంపప్పులను, ఎండుకొబ్బరి కోరును పేస్టులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలాకండ్‌తోపాటు పాలల్లో కలిపి సన్నటి సెగమీద వేడి చేయాలి. మిశ్రమం చిక్కబడుతుండగా పంచదార, మరిగించిన పాలు కలపాలి. పంచదార బాగా కరిగిన తరువాత యాలకుల పొడి వేసి దించేసి.. వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఖర్జూరం, బాదంలతో తయారైన పాయసం సిద్ధమైనట్లే..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments