Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి స్పెషల్ బొబ్బట్లు

Webdunia
బుధవారం, 13 జనవరి 2016 (15:18 IST)
సంక్రాంతి పండుగకు ఊళ్లల్లో వారం ముందు నుంచే పిండి వంటల హడావిడి మొదలయ్యేది ఒకప్పుడు..... గ్రామాలన్నీనెయ్యి వాసనతో గుబాళించేది. పిండి వంటలు చేయడంలో ఊరు ఊరంతా బిజీగా ఉండేది. ఆకాశంలో కనిపించే గాలిపటాలు, ఆకట్టుకునే రంగువల్లులతో కళకళలాడే లోగిళ్లూ, బంధువుల ముచ్చట్లూ..... ఇలా సంక్రాంతి అంటే అన్ని ప్రత్యేకతలే. ఈ సమయంలో ఎన్ని ఎక్కువ పదార్ధాలు చేసుకుంటే పండగ, సంబరాలు అంతలా రెట్టింపు అవుతాయి. అలాంటి వంటల్లో ఒకటైన బొబ్బట్లు ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం!
 
కావలసిన పదార్ధాలు : 
మైదా : అరకిలో 
పచ్చి శెనగపప్పు : పావుకిలో
కొబ్బరి తురుమ : 1 కప్పు
బెల్లం : పావు కిలో
ఎండుద్రాక్షలు, జీడిపప్పు: నెయ్యిలో వేయించినది 
యాలకుల పొడి : కొద్దిగా
నెయ్యి : సరిపడా
 
తయారు చేసే విధానం : 
 
మైదాపిండి జల్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో సరిపడా నీరుపోసి ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో శెనగపప్పును వేసి మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత మిగిలిన నీటిని పూర్తిగా వంపేయాలి. ఈ పప్పులో కొబ్బరికోరు, బెల్లం తురుము, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత  చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని  చిన్నచిన్నఉండలుగా తీసుకోని రెడిచేసి పెట్టుకున్న శెనగపప్పు ముద్దని మధ్యలోపెట్టి మళ్లీ ఉండలుగా చేసి కాస్త మందంగా చపాతిలా చేసి, పెనుము మీద నెయ్యి వేసి కాల్చాలి. అంతే రుచికరమైన వేడివేడి బొబ్బట్లు రెడీ... గార్నిషింగ్ కోసం వేయించిన జీడిపప్పు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments