Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పండు పూర్ణాలు

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (14:24 IST)
కావలసిన పదార్థాలు :
అరటిపండ్లు - ఆరు,
కొబ్బతి తురుము - కప్పు
పంచదార - నాలుగు స్పూన్లు
యాలకుల పొడి - ఒక స్పూన్
జీడిపప్పులు, ఎండుద్రాక్షాలు - కొన్ని
మైదా - నాలుగు స్పూన్లు
నూనె - వేయించడానికి తగినంత
నెయ్యి - రెండు స్పూన్లు
ఉప్పు - చిటికెడు
 
తయారు చేయండి ఇలా: అరటి పండ్లను ఆవిరి మీద కొద్ది సేపు ఉంచాలి. చల్లారాక తొక్క తీసి గుండ్రంగా ముక్కలు తరగాలి. తరువాత బాణలిలో నెయ్యి కరిగించి అరటిపండు ముక్కలు, పంచార, యాలకుల పొడి, కొబ్బరి తరుము, జీడిపప్పు, ఎండుద్రాక్షా వేసి మూత పెట్టాలి. నాలుగైదు నిమిషాలయ్యాక దించాలి. చల్లారాక చేత్తో మెదపాలి. ఈ మిశ్రామాన్ని కావలసినంత సైజులో ఉండలుగా చేసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు మైదాలో కాసిని నీళ్లు ఉప్పి చేర్చి గరిటెజారుగా కలుపుకోవాలి. ఈ పిండిలో అరటి పండు ఉండలను ముంచి కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి దింపేయాలి. అంతే రుచికరమైన బనానా రోల్స్ రెడీ. వీటిని అరటి పండ్లను తినని చిన్నారు సైతం చక్కగా తినేస్తారు. ఇవి పిల్లలకు బలవర్ధకమైనవి.

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments