Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటిపండ్ల గుజ్జుతో కుడుములు తయారీ ఎలా?

Webdunia
మంగళవారం, 19 ఆగస్టు 2014 (18:03 IST)
కావలసిన పదార్థాలు : 
తాజా బియ్యం పిండి... నాలుగు గ్లాసులు
పంచదార పొడి... ఒక గ్లాసు 
అరటిపండ్ల గుజ్జు... 200 గ్రాములు
చిక్కటిపాలు... ఒక గ్లాసు
నెయ్యి... వంద గ్రాములు
యాలక్కాయల పొడి ... సరిపడ 
కొబ్బరి తురుము.. ఒక కాయ మొత్తం
 
తయారీ విధానం :
బియ్యం పిండిలో పంచదార పొడి, యాలక్కాయలపొడి వేసి బాగా కలపాలి. తరువాత అరపండ్ల గుజ్జు, నెయ్యి పోసి మృదువుగా పిండిని కలిపాలి. అందులోనే చిక్కటి పాలు, నెయ్యి, కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలిపి... పిండిని కావలిసిన సైజులో ఉండలుగా చుట్టి... కుక్కరు గిన్నెలో ఉంచి అరగంటసేపు ఆవిరిమీద ఉడికించాలి. అంతే అరటిపండ్ల గుజ్జుతో తయారైన కుడుములు రెడీ అయినట్లే..!
 
రొటీన్‌గా చేసే కుడుములకంటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇవి మిగిలిపోతే పాడవుతాయన్న బెంగ కూడా అవసరం లేదు. ఎందుకంటే, మిగిలిన వాటిని నూనెలో వేయించి తీస్తే, కరకరలాడుతూ ఉంటాయి. కొన్నిరోజులపాటు నిల్వ కూడా ఉంటాయి కూడా. ఇలా వేయించేముందు తీపి సరిపోని వారు మరికాస్త పంచదార కలిపి, వాటిని మెత్తగా పిసికి ఆ తరువాత నూనెలో వేయిస్తే సరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

ఘోరం: పాశమైలారం రియాక్టర్ భారీ పేలుడులో 13 మంది మృతి

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

శ్రీశైలం లడ్డూలో చచ్చిన బొద్దింక: ఆ బొద్దింక ఎలా వచ్చిందో చూస్తున్నారట

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

Naresh: అల్లరి నరేష్ కథానాయకుడిగా ఆల్కహాల్ టైటిల్ ఖరారు

Show comments