కృష్ణాష్టమి : వ్రతం ఆచరిస్తే గోదానం చేసిన ఫలమట!

Webdunia
శనివారం, 16 ఆగస్టు 2014 (15:58 IST)
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. 
 
పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.
 
"ఓ అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చుపెరిగినప్పుడును నన్ను నేను సృజించుకొందును. అనగా సాకార రూపముతో లోకమున నేను అవతరింతును" అని చెప్పియున్నాడు. అందుచేత శ్రీకృష్ణాష్టమి రోజున వ్రతమాచరించి నిష్ఠతో ఆ దేవదేవుడిని పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురైన విద్యార్థులు.. ఏమైంది?

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ వివాదం.. ఎమ్మెల్యేలకు పీకే సూచన

జగన్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారు.. ఆ తేడా కూడా తెలియదా? జబర్దస్త్ శాంతి స్వరూప్ (video)

మహా పాపం నిజం.. తిరుపతి లడ్డూ వివాదం.. వైకాపా, జగనే టార్గెట్‌గా ఫ్లెక్సీలు

తల్లి అంజనా దేవి పుట్టినరోజు.. జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

27-01-2026 మంగళవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

26-01-2026 సోమవారం ఫలితాలు - శ్రమతో కూడిన ఫలితాలిస్తాయి...

25-01-2026 నుంచి 31-01-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

25-01-2026 ఆదివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

Show comments