Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 నుంచి భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలు

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (10:54 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో మంగళవారం వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకలు ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, మామిడి తోరణాలను ఇప్పటికే సిబ్బంది ఏర్పాటు చేశారు. 
 
కరోనా వైరస్‌ ప్రబలంగా ఉన్న నేపథ్యంలో కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం వేడుకలు జరగనున్నాయి. 21న శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ఆలయ ప్రాంగణంలోని నిత్యకల్యాణ వేదిక వద్ద నిర్వహించనున్నారు. 22న మహాపట్టాభిషేకం కూడా అదే వేదికలో జరగనుంది. 
 
ఈ బ్రహ్మోత్సవాలను భక్తులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేకపోవడంతో నిరాడంబరంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భద్రాద్రి రామాలయంలో మంగళవారం నుంచి ఈనెల 27 వరకు నిత్య కల్యాణాలను నిలిపివేయనున్నారు. అలాగే 17 నుంచి 27 వరకు దర్బారు సేవలను, ఈనెల 17 నుంచి మే 4 వరకు పవళింపు సేవలను కూడా నిలిపివేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

డిప్రెషన్ కారణమట.. 45 రోజుల పసికందును గొంతుకోసి చంపేసిన తల్లి

అన్నీ చూడండి

లేటెస్ట్

Pradosha Vratham: 12 సంవత్సరాల పాటు ప్రదోష వ్రతం పాటిస్తే ఏమౌతుందో తెలుసా?

Saumya pradosh: బుధవారం ప్రదోషం.. శివాలయాల్లో సాయంత్రం పూట ఇలా చేస్తే?

20-08- 2025 బుధవారం ఫలితాలు - సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు...

19-08-2025 మంగళవారం ఫలితాలు - బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది...

18-08-2025 సోమవారం ఫలితాలు - శ్రావణ సోమవారం శివార్చన చేస్తే...

తర్వాతి కథనం
Show comments