Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజత పతకం తీసుకుని బేసిక్ కుదుఖోవ్ కుటుంబాన్ని బాధపెట్టను : యోగేశ్వర్ దత్తా

భారత రెజ్లర్, 2012 లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్ అద్భుతమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. ఓ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడిన రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్‌కు దక్కిన రజత పతకాన్ని తీసుకున

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (17:46 IST)
భారత రెజ్లర్, 2012 లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్ అద్భుతమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. ఓ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడిన రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్‌కు దక్కిన రజత పతకాన్ని తీసుకుని ఆ రెజ్లర్ కుటుంబాన్ని మరింతగా బాధపెట్టబోనని ప్రకటించాడు. ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్ పోటీల్లో పలువురు రష్యా ఆటగాళ్లు పాల్గొనలేక పోయారు. దీనికి కారణం డోపింగ్ పరీక్షల్లో పట్టుబడటమే. ఈ నేపథ్యంలో 2012 లండన్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో రజత పతకం సాధించిన బేసిక్ కుదుఖోవ్ డోపింగ్‌లో విఫలమయ్యాడని ఫలితాలు వెల్లడయ్యాయి. 
 
ఇంతలో బేసిక్ కుదుఖోవ్ 2013లో రష్యాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడటం ఇక్కడ గమనార్హం. దీంతో ఆ కుటుంబం ఆ విషాదం నుంచి ఇంకా తేరుకోలేదు. అదేసమయంలో అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య, ఒలింపిక్ యాంటీ డోపింగ్ కమిటీలు అతని నుంచి రజతపతకం తీసుకుని, ఆ ఒలింపిక్స్‌లో కాంస్యపతకం గెలుచుకున్న యోగేశ్వర్ దత్‌కు దానిని ఇవ్వాలని నిర్ణయించింది. 
 
దీనిపై యోగేశ్వర్ దత్ స్పందిస్తూ... బేసిక్ కుదుఖోవ్ మంచి రెజ్లర్ అని తెలిపాడు. డోపింగ్ ఫలితాలు ఇంత ఆలస్యంగా విడుదల కావడం, ఆయన భౌతికంగా లేకపోవడంతో ఆ పతకం తీసుకుని, ఆ కుంటుబాన్ని మరింత విషాదంలోకి నెట్టవద్దని, ఆ పతకం కుదుఖోవ్ కుటుంబం వద్ద ఉండటమే సముచితమని అభిప్రాయపడ్డాడు. ఈ సమయంలో మనమంతా మానవతాదృక్పథంతో నడచుకోవాలని ఆయన సూచించాడు. దీంతో యోగేశ్వర్ దత్ గొప్ప మనసుపై భారత్, రష్యా క్రీడాకారులు, అభిమానులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments