Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమ్మల్ని తిట్టండి.. లేదంటే విమర్శించండి.. కానీ... ఛెత్రి ట్వీట్‌పై కేటీఆర్ స్పందన

మమ్మల్ని తిట్టండి.. లేదంటే విమర్శించండి.. కానీ స్టేడియాలకు వచ్చి మా మ్యాచ్‌లను వీక్షించండి అంటూ ఒక ఆవేదన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి చేసిన ట్వీట్‌పై తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (16:14 IST)
మమ్మల్ని తిట్టండి.. లేదంటే విమర్శించండి.. కానీ స్టేడియాలకు వచ్చి మా మ్యాచ్‌లను వీక్షించండి అంటూ ఒక ఆవేదన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి చేసిన ట్వీట్‌పై తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు.
 
ఛెత్రి ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. నేను త్వరలోనే ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళుతున్నాను. మరి మీ సంగతేంటి? అని తనను ట్విట్టర్లో అనుసరించే సభ్యులను ప్రశ్నించారు. దయచేసి ఛెత్రి ట్వీట్‌ను రీట్వీట్ చేయండి. ప్రపంచ వ్యాప్తంగా అతని సందేశాన్ని అందరికీ చేరవేయండి అంటూ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. 
 
కాగా, శుక్రవారం మొదలైన నాలుగుదేశాల టోర్నీలో భాగంగా చైనీస్‌తైపీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-0 తేడాతో గెలిచింది. ముంబైలోని ఎరీనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు 2000 మంది మాత్రమే హాజరు కావడంతో స్టేడియం బోసిబోయి కనిపించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఛెత్రి హ్యాట్రిక్ సాధించినా ప్రేక్షకులు స్టేడియంలో లేకపోవడంతో అతనిలో సంతోషం కనిపించలేదు.
 
అందుకే ఛెత్రి ట్విట్టర్‌లో తన ఆవేదనను వ్యక్తంచేశాడు. యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్ మ్యాచ్‌లను ఆదరించడంలో తప్పులేదని.. వారి ఆటతీరులో మేం సగమైనా ఆడకపోయినా మమ్మల్నీ ప్రోత్సహించాలని కోరాడు. ఇప్పటికే 97వ ర్యాంకుతో ఆటలో మెరుగవుతున్నామని.. యువ ఆటగాళ్లు రాణిస్తున్న సందర్భంలో ప్రేక్షకుల మద్దతు దొరికితే మరింతగా విజయవంతమవుతామని ఛెత్రి విశ్వాసం వ్యక్తంచేశాడు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments