Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమ్మల్ని తిట్టండి.. లేదంటే విమర్శించండి.. కానీ... ఛెత్రి ట్వీట్‌పై కేటీఆర్ స్పందన

మమ్మల్ని తిట్టండి.. లేదంటే విమర్శించండి.. కానీ స్టేడియాలకు వచ్చి మా మ్యాచ్‌లను వీక్షించండి అంటూ ఒక ఆవేదన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి చేసిన ట్వీట్‌పై తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (16:14 IST)
మమ్మల్ని తిట్టండి.. లేదంటే విమర్శించండి.. కానీ స్టేడియాలకు వచ్చి మా మ్యాచ్‌లను వీక్షించండి అంటూ ఒక ఆవేదన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి చేసిన ట్వీట్‌పై తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు.
 
ఛెత్రి ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. నేను త్వరలోనే ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళుతున్నాను. మరి మీ సంగతేంటి? అని తనను ట్విట్టర్లో అనుసరించే సభ్యులను ప్రశ్నించారు. దయచేసి ఛెత్రి ట్వీట్‌ను రీట్వీట్ చేయండి. ప్రపంచ వ్యాప్తంగా అతని సందేశాన్ని అందరికీ చేరవేయండి అంటూ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. 
 
కాగా, శుక్రవారం మొదలైన నాలుగుదేశాల టోర్నీలో భాగంగా చైనీస్‌తైపీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-0 తేడాతో గెలిచింది. ముంబైలోని ఎరీనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు 2000 మంది మాత్రమే హాజరు కావడంతో స్టేడియం బోసిబోయి కనిపించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఛెత్రి హ్యాట్రిక్ సాధించినా ప్రేక్షకులు స్టేడియంలో లేకపోవడంతో అతనిలో సంతోషం కనిపించలేదు.
 
అందుకే ఛెత్రి ట్విట్టర్‌లో తన ఆవేదనను వ్యక్తంచేశాడు. యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్ మ్యాచ్‌లను ఆదరించడంలో తప్పులేదని.. వారి ఆటతీరులో మేం సగమైనా ఆడకపోయినా మమ్మల్నీ ప్రోత్సహించాలని కోరాడు. ఇప్పటికే 97వ ర్యాంకుతో ఆటలో మెరుగవుతున్నామని.. యువ ఆటగాళ్లు రాణిస్తున్న సందర్భంలో ప్రేక్షకుల మద్దతు దొరికితే మరింతగా విజయవంతమవుతామని ఛెత్రి విశ్వాసం వ్యక్తంచేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

నా కుమార్తె చనిపోయింది... వరకట్న నగలు తిరిగి ఇచ్చేయండి..

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments