Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో పారాలింపిక్స్ : భారత్ ఖాతాలో మరో పతకం

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (18:49 IST)
టోక్యో వేదికాగ పారాలింపిక్స్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా భారత్ ఖాతాలో టేబుల్ టెన్నిస్ విభాగంలో ఒక వెండి పతకం వచ్చి చేరింది. ఇపుడు మరో పతకం వచ్చింది. భారత క్రీడాకారుడు నిషాద్ కుమార్ హైజంప్‌లో రజత పతకం సాధించి రికార్డు సృష్టించాడు. 
 
ఫలితంగా ఐదో రోజైన ఆదివారం భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. పురుషల హై జంప్‌లో అమెరికా అథ్లెట్ టౌన్‌సెండ్ రోడెరిక్ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకోగా, రెండో స్థానంలో నిలిచిన నిషాద్‌కు రజతం దక్కింది. 
 
కాగా, ఆదివారం ఉదయం టేబుల్ టెన్నిస్‌లో భారత క్రీడాకారిణి భవీనా పటేల్ రజతం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించింది. నిషాద్ సహచరుడు రామ్ పాల్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 
 
నిషాద్ తొలి ప్రయత్నంలో 2.06 మీటర్ల మార్కును చేరుకోగా, పసిడి పతక విజేత రోడెరిక్ రికార్డు స్థాయిలో 2.15 మీటర్ల మార్కును చేరుకున్నాడు. అమెరికాకే చెందిన వైజ్ డల్లాస్ 2.06 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. 
 
పారాలింపిక్స్‌లో నిషాద్ రజతం సాధించిన విషయాన్ని ‘సాయ్’ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. హైజంప్ టీ47 ఫైనల్‌లో నిషాద్ 2.06 మీటర్లు జంప్ చేసి ఆసియా రికార్డును సమం చేయడమే కాక, వ్యక్తిగత రికార్డును మెరుగుపరుచుకున్నట్టు పేర్కొంటూ అతడికి అభినందనలు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

హైదరాబాదులో మైనర్ సవతి కూతురిపై వేధింపులు.. ప్రేమ పేరుతో మరో యువతిపై?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments