Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్ : తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన తెలుగు కుర్రోడు

Webdunia
శనివారం, 24 జులై 2021 (16:45 IST)
జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా శనివారమైన తొలి రోజున భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మీరాభాయి చాను వెండి పతకాన్ని సాధించారు. హాకీలో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే, భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం సాయి ప్రణీత్ బ్యాడ్మింటన్ తొలి మ్యాచ్ లోనే ఓడిపోయారు. 
 
శనివారం గ్రూప్-డి ఫురుషుల సింగిల్స్‌లో పోటీపడిన సాయి ప్రణీత్.. తన కంటే తక్కువ ర్యాంక్‌లో ఉన్న ఇజ్రాయిల్ షట్లర్ మిశా జిబర్‌మాన్ చేతిలో ఓడిపోయాడు.17-21, 15-21 తేడాతో ఓటమిని చవిచూశాడు. 
 
2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుపొందిన సాయి ప్రణీత్.. ప్రస్తుతం 15వ ర్యాంక్‌లో ఉన్నాడు. అయినప్పటికీ 47వ ర్యాంక్‌లో ఉన్న జిబర్‌మాన్‌కు ఎదురొడ్డి నిలబడలేకపోయాడు. 
 
ఫలితంగా ఈ మ్యాచ్ కేవలం 41 నిమిషాల్లోనే ముగిసింది. ఒలింపిక్స్‌లో సాయి ప్రణీత్ పోటీపడటం ఇదే తొలిసారి. తన తదుపరి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌‌కి చెందిన మార్క్‌తో సాయి ప్రణీత్ ఆడనున్నాడు. కాగా, మార్క్ ప్రస్తుతం 29వ ర్యాంక్‌లో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments