Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోపన్న - నేను మాట్లాడుకోలేదు... అందుకే మొబైల్ స్విచాఫ్ చేశా : సానియా మీర్జా

రియో ఒలింపిక్స్ క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తృటిలో పతకం చేజార్చుకున్న సానియా మీర్జా... ఆ ఓటమిపై ఇపుడు స్పందించింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత తాను, రోహన్ బోపన్న అనుభవించిన వేదన అంతాఇంతా కాద

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (09:37 IST)
రియో ఒలింపిక్స్ క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తృటిలో పతకం చేజార్చుకున్న సానియా మీర్జా... ఆ ఓటమిపై ఇపుడు స్పందించింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత తాను, రోహన్ బోపన్న అనుభవించిన వేదన అంతాఇంతా కాదని పేర్కొంది. 
 
తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పతక పోరు ముగిసిన రెండు గంటల్లోనే తాను, బోపన్న కలిసి సిన్సినాటి టోర్నీకి బయలుదేరామని, తామిద్దరం సుమారు గంట పాటు ఒక్కమాట కూడా మాట్లాడుకోలేదని, తన మొబైల్‌ను కూడా స్విచ్చాఫ్ చేశానని వెల్లడించింది. ఓటమి తర్వాత వర్ణించలేనంత బాధను అనుభవించామని చెప్పుకొచ్చింది. 
 
ఒలింపిక్స్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయి ఉంటే అంతగా బాధపడి ఉండేవాళ్లం కాదని, కానీ తృటిలో పతకాన్ని చేజార్చుకోవడంతో తన గుండె పగిలినట్టు అయిందని తెలిపింది. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవడం కూడా చిన్న విషయమేమీ కాదని పేర్కొంది. 
 
లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం తమను బాధించింది. పోరు ముగిశాక క్రీడా గ్రామం నుంచి విమానాశ్రయానికి వెళ్లడానికి 1:15 గంటలు పట్టిందని, ఆ సమయంలో ఒకటి రెండు మాటలు తప్పితే పెద్దగా మాట్లాడుకోలేదని తెలిపింది.  పేర్కొంది. ‘‘బాధపడకు, వచ్చేసారి చూద్దాం’’ వంటి సందేశాలు తనకు ఇష్టముండదని, అందుకే సెల్ స్విచ్చాఫ్ చేశానని వివరించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

#Operation Sindoor పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాళరాత్రిని చూపించిన భారత్!!

Modi: ఆపరేషన్ సింధూర్ సక్సెస్.. ఉగ్రవాదులే లక్ష్యంగా సైనిక చర్య.. ప్రధాన మంత్రి

భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో 6జర్నీ తెరకెక్కించాం - దర్శకుడు బసీర్ ఆలూరి

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

తర్వాతి కథనం
Show comments