Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాక్షి మాలిక్‌కు హర్యానా రూ.2.5 కోట్ల బహుమానం.. సర్కారీ కొలువు కూడా...

రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించి పెట్టిన రెజ్లర్ సాక్షి మాలిక్‌పై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా, హర్యానా ప్రభుత్వం ఆమెకు ఏకంగా రూ.2.50 కోట్ల బహుమానం అందజేయ

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (15:08 IST)
రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించి పెట్టిన రెజ్లర్ సాక్షి మాలిక్‌పై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా, హర్యానా ప్రభుత్వం ఆమెకు ఏకంగా రూ.2.50 కోట్ల బహుమానం అందజేయనున్నట్టు ప్రకటించింది. 
 
బుధవారం రాత్రి రియోలో జరిగిన మహిళల 58 కిలోల రెజ్లింగ్ ఫ్రీ స్టైల్ పోటీల్లో సాక్షి కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. రియో ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకం గెలిచిన సాక్షి మాలిక్‌కు హర్యానా ప్రభుత్వం రూ.2.5 కోట్ల నజరానా ప్రకటించింది. అంతేకాకుండా ఆమెకు ప్రభుత్వోద్యోగం కల్పిస్తామని పేర్కొంది. 
 
మరోవైపు కాంస్యం సాధించిన రెజ్ల‌ర్ సాక్షి మాలిక్‌పై ప్ర‌శంస‌లజ‌ల్లు కురుస్తోంది. ప్ర‌ముఖ క్రీడాకారులు, రాజ‌కీయవేత్త‌లు, సినీ న‌టులు ఆమెకు ట్విట్ట‌ర్‌లో కంగ్రాట్స్ తెలుపుతూ మెసేజ్ చేశారు. రోహ‌త‌క్ రెజ్ల‌ర్ సాక్షి 58 కేజీల ఫ్రీ స్ట‌యిల్‌లో కాంస్యాన్ని కైవసం చేసుకుంది. సాక్షి మాలిక్ చ‌రిత్ర సృష్టించింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. రియో క్రీడ‌ల్లో జాతీయ ప‌తాకంతో ర్యాలీలో పాల్గొన్న అభిన‌వ్ బింద్రా కూడా ఆమెకు విషెస్ చెప్పాడు. దేశ ప్ర‌జ‌ల్లో స్ఫూర్తిని నింపిందని కొనియాడారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోనేషియాలో భారీ భూకంపం : సునామీ హెచ్చరికలా?

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

తర్వాతి కథనం
Show comments