అంతర్జాతీయ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ భారత్కు వచ్చారు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐటీపీఎల్)లో భాగంగా భారత్ తరపున బరిలోకి దిగుతున్న ఫెదరర్ తొలిసారిగా భారత టెన్నిస్ కోర్టులపై తన సత్తా చాటనున్నాడు.
ఈ సందర్భంగా ఫెదరర్ స్పందిస్తూ భారత గడ్డపై తొలి మ్యాచ్ ఆడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. భారత్ చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని టెన్నిస్లో మునుపటి రారాజు పీట్ సాంప్రాస్తో కలిసి తీసుకున్న ఫొటోను ఫెదరర్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు.
కాగా, ఈ నెల 28వ తేదీన మొదలైన ఐటీపీఎల్లో భాగంగా శనివారం నుంచి సోమవారం దాకా భారత్లో మ్యాచ్లు జరగుతున్నాయి. భారత జట్టు తరపున రోజర్ ఫెదరర్తో పాటు పీట్ సాంప్రాస్, గ్యాల్ మోన్ ఫిల్స్, అన్నా ఇవానిక్, సానియా మీర్జా, రోహన్ బోపన్నలు అడుతున్నారు.