Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో పారా ఒలింపిక్స్‌‌లో భారత్‌కు రెండో స్వర్ణం.. జావెలిన్ త్రోలో దేవేంద్ర అదుర్స్

ప్రతిష్టాత్మక రియో పారా ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది. దివ్యాంగులు పసిడి పతకాలతో దేశ పరువు ప్రతిష్ఠల్ని కాపాడుతున్నారు. ఇప్పటికే హైజంప్‌లో తమిళనాడు సేలంకు చెందిన మారియప్పన్ తొలి స్వ

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (15:29 IST)
ప్రతిష్టాత్మక రియో పారా ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది. దివ్యాంగులు పసిడి పతకాలతో దేశ పరువు ప్రతిష్ఠల్ని కాపాడుతున్నారు. ఇప్పటికే హైజంప్‌లో తమిళనాడు సేలంకు చెందిన మారియప్పన్ తొలి స్వర్ణం సాధించగా.. జావెలిన్ త్రోలో దేవేంద్ర ఝుఝురియా రెండో స్వర్ణ పతకం సాధించాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్లో మెరుగ్గా ఆడిన దేవేంద్ర జావెలిన్‌ను 63.97 మీటర్లు విసిరి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 
 
దీంతో గతంలో తన పేరిట ఉన్న62.15 మీటర్ల రికార్డు ప్రపంచ రికార్డుని కూడా బ్రేక్ చేశాడు. 2004 ఏథెన్స్‌ పారాలింపిక్స్‌లోనూ ఝఝారియా ఈ ఘనతను సాధించాడు. ప్రస్తుతం రియోలోనూ తన సత్తా ఏంటో నిరూపించాడు. దేవేంద్ర సాధించిన పసిడి పతకం ద్వారా భారత్ ఖాతాలోకి రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం వచ్చి చేరాయి. పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. ఇకపోతే.. రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం సాధించిన ఝుఝురియాకు ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments