పారాఒలింపిక్స్ హైజంప్లో స్వర్ణం సాధించిన మారియప్పన్ తంగవేలు ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనే నిజం వెలుగులోకి వచ్చింది. రియోలో జరిగిన పారా ఒలింపిక్ పోటీల్లో హైజంప్లో బంగారం సాధించిన మారియప్ప
పారాఒలింపిక్స్ హైజంప్లో స్వర్ణం సాధించిన మారియప్పన్ తంగవేలు ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనే నిజం వెలుగులోకి వచ్చింది. రియోలో జరిగిన పారా ఒలింపిక్ పోటీల్లో హైజంప్లో బంగారం సాధించిన మారియప్పన్ తంగవేలును దేశమంతటా కీర్తిస్తోంది.
మారియప్పన్కు ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి కొనియాడారు. సెలెబ్రిటీలు మారియప్పన్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే పారాఒలింపిక్స్లో పతకం సాధించడానికి ముందు.. తాను ఆ స్థాయికి చేరుకోకముందు.. తన ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింజని తంగవేలు చెప్పుకొచ్చాడు.
ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తరుణంలో తంగవేలు తల్లి కుటుంబంతో పాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు సిద్ధమైనట్లు తల్లి సరోజ తెలిపింది. చిన్నతనంలోనే అతని తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవడంతో ఆధారం లేక, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సరోజ చెప్పింది.
కానీ సెలవు రోజుల్లో సంపాదించి కుటుంబాన్ని పోషిస్తానని మారియప్పన్ చెప్పడంతో పాటు మనకు మంచి రోజులు వస్తాయని ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశాడని చెప్పుకొచ్చింది. అలా అప్పట్లో ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నాడని..ఆపై పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పారాఒలింపిక్స్ వరకు వచ్చి, స్వర్ణ పతకం సాధించాడని వెల్లడించింది. మారియప్పన్కు ఐదేళ్లున్నప్పుడు ఓ ప్రమాదంలో కాలు పోయిందని సరోజ తెలిపింది.