భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కెరీర్పై నీలి నీడలు కమ్ముకున్నాయి. నేషనల్ యాంటి డోపింగ్ ఏజన్సీ (నాడా) నిర్వహించిన టెస్ట్లో నిషేధిత స్టెరాయిడ్ వాడినట్టుగా తేలింది. ఫలితంగా డోప్ పరీక్షలో నర్సింగ్ యాదవ్ విఫలమయ్యాడు. దీంతో నిర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్లో పాల్గొనడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఒలింపిక్స్ 74 కిలోల రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ పోటీ పడాల్సి ఉంది. గత ఏడాది ప్రపంచ కుస్తీ పోటీల్లో నర్సింగ్ కాంస్యం సాధించి మెగా ఈవెంట్కు బెర్త్ సాధించాడు. స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ను కాదని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యంగ్ రెజ్లర్కు అవకాశం ఇచ్చిన విషయం తెల్సిందే. దీనిపై విమర్శలు చెలరేగినా.. భారత ఒలింపిక్ సంఘం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
నర్సింగ్ సమక్షంలోనే ఎన్ఏడీఏ శాంపిల్ 'బి' టెస్టులు చేయగా, పూర్తి నివేదిక రాగానే నర్సింగ్ను రియో పంపాలా.. వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే భారత రెజ్లింగ్ సమాఖ్య ఇప్పటివరకూ నర్సింగ్ యాదవ్ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఆగస్టు 5 నుంచి 21 వరకు జరగనున్న రియో ఒలింపిక్స్ లో 74 కేజీల విభాగంలో భారత్ తరఫున నర్సింగ్ బరిలో దిగనున్న విషయం తెలిసిందే.