Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి సేవలో పీవీ సింధు

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (15:02 IST)
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ ప్లేయర్, భారత షట్లర్ పీవీ సింధు మంగళవారం హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ దర్శనానికి వచ్చిన పీవీ సింధుకు ఆలయ ట్రస్టీ ఛైర్మన్ శాలువా కప్పి ఘనంగా సత్కరించినట్లు తెలుస్తోంది.
 
కాగా ఒలింపిక్స్‌లో పతకం గెలిచినందుకు సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పీవీ సింధుకు ప్రధాని నరేంద్ర మోడీ ఐస్‌క్రీమ్ తినిపించిన విషయం తెల్సిందే. అంతకుముందు స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఎర్రకోటకు కూడా ఒలింపిక్స్ అథ్లెట్లను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించగా ఈ బృందంలో కూడా పీవీ సింధు ఉన్నారు. 
 
ఈ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న ఆమె మంగళవారం ఉదయం భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంది. పీవీ రాక సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

North Andhra: అల్పపీడనం- ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరప్రాంతంలో భారీ వర్షాలు

సంగారెడ్డిలో చిరుతపులి కలకలం.. దూడను చంపింది.. నివాసితుల్లో భయం భయం

ప్రియుడి మోజులో పడి భర్తను, 22 ఏళ్ల కుమార్తెను చంపిన మహిళ

Viral Video: ఏడేళ్ల క్రితం కనిపించకుండా పోయాడు.. వైరల్ రీల్స్‌తో దొరికిపోయాడు..

2.0 రప్ప రప్ప డైలాగ్- ఎరుపు రంగులో, గొడ్డలి గుర్తుతో రాశారు - వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

తర్వాతి కథనం
Show comments