Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి సేవలో పీవీ సింధు

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (15:02 IST)
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ ప్లేయర్, భారత షట్లర్ పీవీ సింధు మంగళవారం హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ దర్శనానికి వచ్చిన పీవీ సింధుకు ఆలయ ట్రస్టీ ఛైర్మన్ శాలువా కప్పి ఘనంగా సత్కరించినట్లు తెలుస్తోంది.
 
కాగా ఒలింపిక్స్‌లో పతకం గెలిచినందుకు సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పీవీ సింధుకు ప్రధాని నరేంద్ర మోడీ ఐస్‌క్రీమ్ తినిపించిన విషయం తెల్సిందే. అంతకుముందు స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఎర్రకోటకు కూడా ఒలింపిక్స్ అథ్లెట్లను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించగా ఈ బృందంలో కూడా పీవీ సింధు ఉన్నారు. 
 
ఈ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న ఆమె మంగళవారం ఉదయం భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంది. పీవీ రాక సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

14న ఏపీలో పిడుగులతో కూడిన వర్షమే వర్షం

పటాన‌చెరులో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్!!

Supreme Court: కొమ్మినేనికి బెయిల్- సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది: జగన్

Ahmedabad: భర్తను కలిసేందుకు లండన్‌కు వెళ్ళిన ఖుష్భూ.. తండ్రితో దిగిన చివరి ఫోటో వైరల్

Kommineni: ఏపీ సర్కారుకు సుప్రీం చీవాట్లు.. కొమ్మినేనికి బెయిల్- విడుదల చేయండి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

తర్వాతి కథనం
Show comments