Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌కు పీవీ సింధు : శంషాబాద్‌లో ఘన స్వాగతం

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (15:55 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు బుధవారం తన సొంతగడ్డ హైదరాబాద్‌కు వచ్చారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 
 
తెలంగాణ రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, సాట్స్‌ ఛైర్మన్‌ వెంకటేశ్వర రెడ్డి, సీపీ సజ్జనార్‌, అభిమానులు ఘన స్వాగతం పలికారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాక సింధు తొలిసారి హైదరాబాద్‌ వచ్చారు.
 
ఆ తర్వాత విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. వచ్చే ఒలింపిక్స్‌లో సింధు స్వర్ణం సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తున్నామని.. త్వరలోనే రాష్ట్రంలో మంచి క్రీడా విధానం తీసుకొస్తామన్నారు. 
 
అలాగే, పీవీ సింధు తెలంగాణ రాష్ట్రం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. అందరి ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని సింధు ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఒలింపిక్స్ పోటీల్లో వరుసగా పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

నోటికాడి బుక్క నీటిపాలాయె... దూసుకొస్తున్న అల్పపీడనం...

ప్రియుడితో కలిసి కుమార్తెకు చిత్రహింసలు.. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటినిండా వాతలు!!

గుంటూరులో ఘోరం : గొంతుకొరికి బాలుడిని చంపేసిన కుక్క!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

తర్వాతి కథనం
Show comments