Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌కు పీవీ సింధు : శంషాబాద్‌లో ఘన స్వాగతం

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (15:55 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు బుధవారం తన సొంతగడ్డ హైదరాబాద్‌కు వచ్చారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 
 
తెలంగాణ రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, సాట్స్‌ ఛైర్మన్‌ వెంకటేశ్వర రెడ్డి, సీపీ సజ్జనార్‌, అభిమానులు ఘన స్వాగతం పలికారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాక సింధు తొలిసారి హైదరాబాద్‌ వచ్చారు.
 
ఆ తర్వాత విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. వచ్చే ఒలింపిక్స్‌లో సింధు స్వర్ణం సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తున్నామని.. త్వరలోనే రాష్ట్రంలో మంచి క్రీడా విధానం తీసుకొస్తామన్నారు. 
 
అలాగే, పీవీ సింధు తెలంగాణ రాష్ట్రం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. అందరి ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని సింధు ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఒలింపిక్స్ పోటీల్లో వరుసగా పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments