Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌కు పీవీ సింధు : శంషాబాద్‌లో ఘన స్వాగతం

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (15:55 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు బుధవారం తన సొంతగడ్డ హైదరాబాద్‌కు వచ్చారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 
 
తెలంగాణ రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, సాట్స్‌ ఛైర్మన్‌ వెంకటేశ్వర రెడ్డి, సీపీ సజ్జనార్‌, అభిమానులు ఘన స్వాగతం పలికారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాక సింధు తొలిసారి హైదరాబాద్‌ వచ్చారు.
 
ఆ తర్వాత విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. వచ్చే ఒలింపిక్స్‌లో సింధు స్వర్ణం సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తున్నామని.. త్వరలోనే రాష్ట్రంలో మంచి క్రీడా విధానం తీసుకొస్తామన్నారు. 
 
అలాగే, పీవీ సింధు తెలంగాణ రాష్ట్రం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. అందరి ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని సింధు ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఒలింపిక్స్ పోటీల్లో వరుసగా పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments