తిరుమల శ్రీవారి ఆశీస్సులతోనే రియో ఒలంపిక్స్ లో గెలిచా : పి.వి.సింధు
తిరుమల శ్రీనివాసుని ఆశీస్సులతోనే రియో ఒలంపిక్స్ క్రీడల్లో విజయం సాధించగలిగానని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు చెప్పుకొచ్చారు. ఆమెతో పాటు.. కోచ్ పుల్లెల గోపీచంద్లు ఆదివారం ఉదయం విఐపి వి
తిరుమల శ్రీనివాసుని ఆశీస్సులతోనే రియో ఒలంపిక్స్ క్రీడల్లో విజయం సాధించగలిగానని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు చెప్పుకొచ్చారు. ఆమెతో పాటు.. కోచ్ పుల్లెల గోపీచంద్లు ఆదివారం ఉదయం విఐపి విరామ దర్శనా సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా 68 కిలోల బెల్లంతో తులాభారం సమర్పించి ఆమె మ్రొక్కును తీర్చుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రియో ఒలంపిక్స్కు ముందు శ్రీవారిని దర్శించుకున్నానని, ఆయన కృప ఉండడంతోనే విజయం సాధించగలిగినట్టు చెప్పారు. రియోలో రాణించి స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.