ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్లో తెలుగు క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ మంచి శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ నాలుగో ర్యాంక్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కెనిచి టాగో (జపాన్)ను చిత్తు చేశాడు.
ఈ మ్యాచ్లో 21-11, 21-18 స్కోరు తేడాతో టాగోను ఓడించిన కశ్యప్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 28వ ర్యాంకులో ఉన్న కశ్యప్ కేవలం 34 నిమిషాల్లోనే వరుస సెట్లలో టాగోను ఓడించడం గమనార్హం. మరోవైపు మహిళల సింగిల్స్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ రెండో రౌండ్కు దూసుకెళ్లింది.