Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్ 2021లో నిరాశ.. చేతులెత్తేసిన షూటర్లు

Webdunia
సోమవారం, 26 జులై 2021 (11:19 IST)
shooting
భారత షూటర్ల బృందం టోక్యో ఒలింపిక్స్ 2021లో నిరాశ ఎదురైంది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ ఈవెంట్లో మను బాకర్‌తో పాటు యశస్విని సింగ్ ఫైనల్‌కు అర్హత సాధించలేదు. మను బాకర్ పిస్టల్‌కు చెందిన ఎలక్ట్రానికి ట్రిగ్గర్‌లో సాంకేతిక లోపం ఎదురైంది. ఎయిర్ పిస్టర్ 10 మీటర్ల ఈవెంట్‌లో గంట 15 నిమిషాల వ్యవధిలో 60 షాట్లు కాల్చాల్సి ఉంటుంది. అయితే 16 షాట్లు పూర్తయ్యాక ట్రిగ్గర్‌లో లోపం వచ్చింది. 
 
నిబంధనల ప్రకారం అక్కడికక్కడే లోపాన్ని సరిచేసుకోవడానికి వీలుండదు. దీంతో పోటీ స్థలంనుంచి దూరంగా వెళ్లి పిస్టల్ సరి చేసుకొని తిరిగి వచ్చే సరికి దాదాపు 20 నిమిషాల సమయం వృధా అయ్యింది. తొలి 20 నిమిషాల్లో కేవలం 16 షాట్లు మాత్రమే పూర్తి చేసింది. మిగిలిన 44 షాట్లను కొట్టడానికి 55 నిమిషాల సమయం మాత్రమే మిగిలింది. దీంతో ఒత్తిడికి గురైన మను బాకర్ చివర్లో సరైన గురి పెట్టలేకపోయింది. 
 
త్వరత్వరగా షాట్లు కొట్టడానికి ప్రయత్నించి పాయింట్లు పోగొట్టుకుంది. ఐదో సిరీస్‌లో 98 పాయింట్ల కనుక సాధించి ఉంటే ఫైనల్ రౌండ్‌కు చేరుకునేది. కానీ కేవలం 95 పాయింట్లు మాత్రమే సాధించి 3 పాయింట్ల తేడాతో ఫైనల్ బెర్త్ కోల్పోయింది. టోక్యో ఒలింపిక్స్‌లో తప్పక పతకం సాధిస్తుందని మను బాకర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ పిస్టల్ రూపంలో ఆమెకు దురదృష్టం వెంటాడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

తర్వాతి కథనం
Show comments