Webdunia - Bharat's app for daily news and videos

Install App

కపిల్ దేవ్‌పై విమర్శలు గుప్పించిన బాక్సర్ మనోజ్ కుమార్!

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (11:14 IST)
2010 సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన బాక్సర్ మనోజ్‌కుమార్‌ కపిల్ దేవ్‌పై ఫైర్ అయ్యాడు. అర్జున అవార్డుల కమిటీ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌పై బాక్సర్ మనోజ్ కుమార్ విమర్శలు కురిపించాడు. కోర్టులో న్యాయ పోరాటాన్ని గెలిచి, బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ నుంచి అర్జున అవార్డును స్వీకరించిన బాక్సర్ మనోజ్ కుమార్ ఒకవైపు ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 
 
అయితే మరోవైపు అర్జున అవార్డుకు అన్నివిధాలా అర్హుడినైనా, తప్పుడు సమాచారంతో కపిల్ దేవ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ తనను పక్కనబెట్టి మరో బాక్సర్‌ను ఎంపికచేసిందని మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
 
చివరకు కోర్టులో పోరాడి ఇప్పుడు అర్జున అవార్డును అందుకుంటున్నానని మనోజ్ అన్నాడు. తాను కామన్వెల్త్‌లో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నానని కపిల్‌కు గర్వంగా సమాధానం చెప్తానని తెలిపాడు. 
 
‘అప్పుడు నీవెవరు అని ప్రశ్నించావ్..ఈరోజు మళ్లీ చెబుతున్నా.. నేను మనోజ్‌ను. ఇదిగో.. అర్జున అవార్డు గ్రహీతను' అని కపిల్‌ను ఉద్దేశిస్తూ మనోజ్ ఘాటుగా బదులిచ్చాడు.  

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments