Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రియో ఒలింపిక్స్‌లో భారత్‌దే అత్యంత చెత్త ప్రదర్శన' : కివీస్ పత్రిక

రియో ఒలింపిక్స్ పోటీల్లో భారత్ క్రీడాకారుల ప్రదర్శన అత్యంత చెత్తగా ఉంది. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు కేవలం రెండు పతకాలు మాత్రమే వచ్చాయి. అవీకూడా మహిళలు సాధిం

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (09:23 IST)
రియో ఒలింపిక్స్ పోటీల్లో భారత్ క్రీడాకారుల ప్రదర్శన అత్యంత చెత్తగా ఉంది. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు కేవలం రెండు పతకాలు మాత్రమే వచ్చాయి. అవీకూడా మహిళలు సాధించిపెట్టాయి. 
 
మరీ ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ళ ప్రదర్శన గురించి బయటి ప్రపంచం ఏమనుకుంటుందో పరిశీలిస్తే... 'రియో ఒలింపిక్స్‌లో భారత్‌దే అత్యంత చెత్త ప్రదర్శన' అని ఓ న్యూజిల్యాండ్‌ దినపత్రిక నోరు పారేసుకుంటే.. ప్రముఖ బ్రిటిష్‌ జర్నలిస్టు పీయర్స్‌ మోర్గాన్‌ మరింత చెత్త వ్యాఖ్యలు చేసి.. ట్విట్టర్‌లో దుమారం రేపాడు.
 
'120 కోట్ల జనాభా కలిగిన దేశం కేవలం రెండంటే రెండు పతకాలు తెచ్చుకున్నందుకు సంబురాలు జరుపుకొంటోంది. ఎంత చికాకు కలిగించే విషయమిది' అంటూ మోర్గాన్‌ చేసిన ట్వీట్‌పై భారతీయ నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. 
 
ఇతర దేశాలపై నోరు పారేసుకునేముందు నీ సొంత పనేంటో చూసుకోమని ఘాటుగా బదులిచ్చారు. ఎవరైనా, ఏదైనా గెలిచినప్పుడు సంబురాలు చేసుకోవడం మీ సంస్కృతిలో చికాకు కలిగించే విషయం కావొచ్చుకానీ, మా దేశ సంస్కృతిలో కాదంటూ గట్టిగా మందలించారు.
 
'ఒలింపిక్స్‌ ఇండియా వరెస్ట్‌ కంట్రీ' అనే శీర్షికతో న్యూజిలాండ్‌ హెరాల్డ్‌ పత్రిక ఓ కథనాన్ని వండివార్చింది. భారత్‌ రెండు మెడల్స్‌ సాధించి పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచిందని, జనాభా, జీడీపీ ప్రకారం చూసుకుంటే.. ఒలింపిక్స్‌లో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇదే చెత్త ప్రదర్శన అని పేర్కొంది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments