Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్న కిడాంబి శ్రీకాంత్ - గంటూరు కుర్రోడికి అందలం

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (08:26 IST)
స్పెయిన్‌లో జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిఫ్ ఫైనల్ పోటీల్లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్ టైటిల్ సమరంలో శ్రీకాంత్ 15-21, 20-22 తేడాతో సింగపూర్‌కు చెందిన కీన్ యూ చేతిలో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 
 
తొలి గేమ్‌లో పేలవంగా ఆడిన శ్రీకాంత్.. రెండో గేమ్‌లో పోరాటపటిమ చూపించినప్పటికీ అప్పటికే మ్యాచ్ తన చేతుల్లోని చేజారిపోయింది. ఫలితంగా కీ యూ విజయం సాధించగా, కిడాంబి ఓటమి పాలయ్యాడు. దీంతో తృటిలో బంగారు పతకాన్ని కోల్పోయాడు. అయితే, సిల్వర్ మెడల్ సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 
 
మరోవైపు, గుంటూరు యువ క్రికెటర్‌కు అరుదైన ఘన సాధించాడు. వచ్చే యేడాది ప్రథమార్థంలో వెస్టిండీస్ వేదికగా జరిగే అండర్-19 ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొనే భారత అండర్-19 జట్టుకు వైస్ కెప్టెన్‌గా గుంటూరుకు చెందిన షేక్ రషీద్ నియమితులయ్యాడు. ఈ టోర్నీ 2022 జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇందుకోస 17 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అధికారంలోకి వచ్చిన కూటమి.. తామే గెలిచామన్న సంతోషంలో ప్రజలు : నారా భువనేశ్వరి

పవన్ కోసం పరుగులు తీసిన యువతి.. కాన్వాయ్‌తో పోటీ పడి రన్ (video)

ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 24న జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా?

వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అయితే సమాజానికి మరింత హాని : సుప్రీంకోర్టు

తీహార్ జైలులో కవితను కలిసిన బీఆర్ఎస్ నేతలు

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ నుంచి ఖలసే సాంగ్ రిలీజ్

పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో అశ్విన్ బాబు శివం భజే చిత్రం

దర్శకుడు తేజ ఆవిష్కరించిన పోలీస్ వారి హెచ్చరిక టైటిల్ లోగో

ఆ గాయంతోనే నింద షూటింగ్ చేశాను : హీరో వరుణ్ సందేశ్

సీతా కళ్యాణ వైభోగమే ట్రైలర్, పాటలు బాగున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments