Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా లక్ష్యం 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే: పివీ సింధు

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (18:35 IST)
తాజాగా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి, స్వర్ణ పతకంతో సగర్వంగా స్వదేశానికి తిరిగి వచ్చిన పివీ సింధు, గోపీచంద్ అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించింది. 
 
ఈ విజయం కోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూసానని, ఎట్టకేలకు తన కల నెరవేరిందని ఆమె అన్నారు. తన విజయపరంపరలో వెన్నంటే నిలిచిన గురువులు గోపిచంద్‌కి, కిమ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. తన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పింది.
 
2020లో టోక్యోలో జరిగే ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధించడమే తన తదుపరి లక్ష్యమని ఆమె వెల్లడించారు. ఇందుకోసం తీవ్ర పోటీ ఉంటుందని, అయినప్పటికీ వాటిని దాటుకుంటూ వెళ్లేందుకు తన వద్ద ప్రత్యేక వ్యూహాలు ఉన్నాయని, అంతేకాకుండా ఒలంపిక్స్‌కు ముందు చాలా టోర్నీలు ఆడాలని ఆమె పేర్కొంది. 
 
ఇలాంటి సూపర్ సిరీస్‌లు ఆడటం వల్ల ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ, ఎప్పటికప్పుడు తన టెక్నిక్స్ మెరుగుపరుచుకోవచ్చని ఆమె భావిస్తోంది. టాప్-10 ప్లేయర్స్ అందరికీ తమ బలాలు, బలహీనతలు తెలిసి ఉంటాయి, కాబట్టి సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగాలి. ఈ సందర్భంగా అండగా నిలిచిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments