Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యారిస్ ఒలిపింక్స్ : నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత పురుషు ఆర్చరీ టీమ్

వరుణ్
శుక్రవారం, 26 జులై 2024 (08:28 IST)
విశ్వక్రీడలు (ఒలింపిక్స్) శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ క్రీడలకు ప్యారిస్ ఆతిథ్యమిస్తుంది. అయితే, భారత పురుషుల టీమ్ అరుదైన ఘనత సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 పోటీల్లో నేరుగా క్వార్టర్ ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించింది. ప్యారిస్‌లోని ఎప్లానేడ్ డెస్ ఇన్వాలిడ్స్‌లో జరిగిన ర్యాంకింగ్ రౌండ్‌లో భారత అర్చర్లు ఆరంభంలోనే తడబాటుకు గురైనప్పటికీ.. ఆ తర్వాత పుంజుకుని టాప్-4లో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. 
 
అర్చర్లు బొమ్మదేవర ధీరజ్, తరుణ్ దీవ్ రాయ్, ప్రవీణ్ జాదవ్ అదరగొట్టారు. మొత్తం 2013 పాయింట్లు సాధించారు. 681 పాయింట్లు సంపాదించిన ధీరజ్.. భారత జట్టుని టాప్ - 4లో నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అత్యుత్తమంగా రాణించి వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. 
 
కాగా, భారత జట్టు మూడో స్థానంలో నిలవడంతో క్వార్టర్ ఫైనల్‌ రౌండ్‌లో టర్కీ లేదా కొలంబియాతో తలపడే అవకాశం ఉంది. భారత జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుని అక్కడ నుంచి దక్షిమ కొరియా జట్టు ఎదురుకాకుంటే టాప్-2లో నిలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments