Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను చిత్తు చేసిన పాకిస్థాన్... టైటిల్ కైవసం (video)

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (13:44 IST)
భారత్‌ను పాకిస్థాన్ చిత్తుచేసింది. కబడ్డీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ఫైనల్ పోటీలో భారత్‌ను ఓడించిన పాకిస్థాన్... విజయభేరీ మోగించింది. ఫలితంగా టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. 
 
లాహోర్‌లోని పంజాబ్ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో.. భార‌త్‌పై 43-41 స్కోర్ తేడాతో పాక్ నెగ్గింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో.. తొలి అర్థ భాగంలో ఫ‌స్ట్ హాఫ్‌లో భారత్‌ డామినేట్ చేసింది. కానీ సెకండ్ హాఫ్‌లో పాక్ త‌న జోరును ప్ర‌ద‌ర్శించి.. క‌బ‌డ్డీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను తొలిసారి త‌న ఖాతాలో వేసుకున్న‌ది. 
 
రెండు సెష‌న్స్‌లోనూ రెండు దేశాల మ‌ధ్య మ్యాచ్ నువ్వానేనా అన్న‌ట్టుగా సాగింది. పాక్ ఆట‌గాళ్లు బిన్‌యామీన్‌, ఇర్ఫాన్ మానా, షఫిక్ చిస్తీలు త‌మ జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. క‌బ‌డ్డీ వ‌ర‌ల్డ్‌క‌ప్ తొలిసారి పాకిస్థాన్‌లో జ‌రిగింది. గ‌తంలో ఆరుసార్లు ఈ టోర్న‌మెంట్‌ను ఇండియాలోనే నిర్వ‌హించారు. 
 
8 రోజుల పాటు సాగిన టోర్నీలో లాహోర్‌, ఫైస‌లాబాద్‌, క‌ర్తార్‌పూర్‌, నాన్‌క‌న్ సాహిబ్ న‌గ‌రాల్లో మ్యాచ్‌లను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌లో ఇండియాతో పాటు ఇరాన్, కెన‌డా, ఆస్ట్రేలియా, అమెరికా, సియ‌రాలియోన్‌, కెన్యా కూడా పాల్గొన్నాయి. టైటిల్ గెలిచిన పాక్‌కు ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్ కంగ్రాట్స్ చెప్పారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

తర్వాతి కథనం
Show comments