Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను చిత్తు చేసిన పాకిస్థాన్... టైటిల్ కైవసం (video)

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (13:44 IST)
భారత్‌ను పాకిస్థాన్ చిత్తుచేసింది. కబడ్డీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ఫైనల్ పోటీలో భారత్‌ను ఓడించిన పాకిస్థాన్... విజయభేరీ మోగించింది. ఫలితంగా టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. 
 
లాహోర్‌లోని పంజాబ్ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో.. భార‌త్‌పై 43-41 స్కోర్ తేడాతో పాక్ నెగ్గింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో.. తొలి అర్థ భాగంలో ఫ‌స్ట్ హాఫ్‌లో భారత్‌ డామినేట్ చేసింది. కానీ సెకండ్ హాఫ్‌లో పాక్ త‌న జోరును ప్ర‌ద‌ర్శించి.. క‌బ‌డ్డీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను తొలిసారి త‌న ఖాతాలో వేసుకున్న‌ది. 
 
రెండు సెష‌న్స్‌లోనూ రెండు దేశాల మ‌ధ్య మ్యాచ్ నువ్వానేనా అన్న‌ట్టుగా సాగింది. పాక్ ఆట‌గాళ్లు బిన్‌యామీన్‌, ఇర్ఫాన్ మానా, షఫిక్ చిస్తీలు త‌మ జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. క‌బ‌డ్డీ వ‌ర‌ల్డ్‌క‌ప్ తొలిసారి పాకిస్థాన్‌లో జ‌రిగింది. గ‌తంలో ఆరుసార్లు ఈ టోర్న‌మెంట్‌ను ఇండియాలోనే నిర్వ‌హించారు. 
 
8 రోజుల పాటు సాగిన టోర్నీలో లాహోర్‌, ఫైస‌లాబాద్‌, క‌ర్తార్‌పూర్‌, నాన్‌క‌న్ సాహిబ్ న‌గ‌రాల్లో మ్యాచ్‌లను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌లో ఇండియాతో పాటు ఇరాన్, కెన‌డా, ఆస్ట్రేలియా, అమెరికా, సియ‌రాలియోన్‌, కెన్యా కూడా పాల్గొన్నాయి. టైటిల్ గెలిచిన పాక్‌కు ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్ కంగ్రాట్స్ చెప్పారు. 
 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments