Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోపన్నను ఆ మాట అడగను.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ గెలిస్తేనే: ఖురేషి

ముంబై పేలుళ్ల అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య క్రీడా పోటీలు కూడా కరువైయ్యాయి. ఇందులో భాగంగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీ

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (17:19 IST)
ముంబై పేలుళ్ల అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య క్రీడా పోటీలు కూడా కరువైయ్యాయి. ఇందులో భాగంగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ వేదికలపై తలపడుతున్నాయే కానీ.. భారత్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టో, పాక్‌లో భారత టీమో పర్యటించట్లేదు. 
 
ఈ నేపథ్యంలో ఇండో-పాక్ టెన్నిస్ ఆటగాళ్లు మాత్రం.. 'స్టాప్ వార్.. స్టార్ట్ టెన్నిస్' పేరిట రోహన్ బోపన్న- ఖురేషిలు పిలుపునిచ్చారు. ఇద్దరూ ఫ్రెంచ్ ఓపెన్‌ బరిలోకి దిగనున్నారు.  తొలి రౌండ్ లోనే ఓటమిపాలైన ఖురేషీ ఆదివారం జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు లండన్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై గెలిస్తేనే పాక్ జట్టుకు ఘన స్వాగతం ఉంటుందని, భారత్ పై ఓడితే మాత్రం చీత్కారాలు తప్పవని స్పష్టం చేశాడు.
 
పాకిస్థాన్‌కు మద్దతివ్వాలని తాను బోపన్నను అడగను. అలాగే భారత్‌కి మద్దతివ్వమని ఆయన తనను అడగడని చెప్పాడు. తాము చాలా కాలంగా స్నేహితులమని అన్నాడు. టెన్నిస్‌ కోర్టు బయటైనా, లోపలైనా రోహన్‌ తనకు సోదరుడులాంటి వాడని చెప్పాడు. భారత్-పాక్ మధ్య విభేదాలకు ఏవో కారణాలున్నాయి. కానీ తమ మధ్య అలాంటివి లేవని, తామిద్దరం ఒకరినొకరం గౌరవించుకుంటామని చెప్పాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

తర్వాతి కథనం
Show comments