Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా సృష్టించిన కొత్త చరిత్ర ఏంటి?

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (12:54 IST)
భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా కొత్త చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్ బంగారు పతక విజేత అయిన చోప్రా... తాజాగా జావెలిన్ త్రోలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ చాంపియన్ షిప్ టోర్నీలో పాల్గొనడం ద్వారా తొలి భారత క్రీడాకారుడుగా గుర్తింపు పొందారు. 
 
ఈ టోర్నీలోభాగంగా గురువారం రాత్రి స్విట్జర్‌ల్యాండ్‌లోని జురిచ్‌లో జరిగిన ఫైనల్ పోటీలో చోప్రా బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలో ఆరు మెటి జావెలిన్ త్రోయర్లు పోటీపడిన ఈ చాంపియన్ పోటీలో నీరజ్ చోప్రా తన బల్లెంను అత్యధికంగా 88.44 మీటర్లుగా విసిరి విజేతగా నిలిచాడు. తన తొలి ప్రయత్నంలోనే చోప్రా అందరికంటే ఎక్కువ దూరం విసిరి గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు. 
 
కాగా, గాయం కారణంగా కామన్వెల్త్ క్రీడలకు దూరమైన చోప్రా.. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుని జూలై ఆఖరులో లాసానె డైమండ్ లీగ్‌లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఫలితంగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. డైమండ్ లీగ్ ఫైనల్లో అతను పోటీ పడటం ఇది మూడోసారి. గతంలో 2017, 2018 ఎడిషన్స్‌లో ఫైనల్స్ ఆడినా... వరుసగా ఏడు, నాలుగో స్థానాలతో సరిపెట్టాడు. ఈసారి మాత్రం స్వర్ణంతో తిరిగొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

తర్వాతి కథనం
Show comments