Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషుల వాలీబాల్ మ్యాచ్‌కెళ్లిన పాపం.. జైలులోనే?

Webdunia
గురువారం, 16 అక్టోబరు 2014 (18:37 IST)
పురుషుల వాలీబాల్ మ్యాచ్‌కెళ్లిన పాపానికి ఓ మహిళ జైలు జీవితం కొనసాగిస్తోంది. ఇరాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరాన్ మహిళలపై ఆంక్షలు కఠినంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో బ్రిటీష్-ఇరానియన్ మహిళ ఘోంచే ఘవామీ పురుషుల వాలీబాల్ మ్యాచ్‌కు హాజరవడమే కాక, "మీరు కూడా వాలీబాల్ మ్యాచ్‌లకు వెళ్ళగలగాలి" అని ఇతర మహిళలకు పిలుపునిచ్చింది. అదే ఆమె చేసిన నేరం! వెంటనే ఇరాన్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రిమాండ్ ఖైదీగా ఆమెను ఇప్పటికే మూడు నెలలకు పైగా జైల్లో ఉంచారు. 
 
కాగా లా గ్రాడ్యుయేట్ అయిన ఘవామీ టెహ్రాన్‌లోని ఆజాదీ స్టేడియంలో జరుగుతున్న ఇరాన్-ఇటలీ పురుషుల వాలీబాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్ళింది. ఇరాన్‌లో క్రీడాపోటీల సందర్భంగా మహిళలు పురుష ప్రేక్షకులతో కలిసి కూర్చోవడం నిషిద్ధం. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు. 
 
గతవారం ఆమె జైలులో నిరసన దీక్ష చేపట్టారు. ఘవామీ వ్యవహారంపై స్పందించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆమెను విడుదల చేయాలంటూ సంతకాల సేకరణ చేపట్టింది.

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్