పారాలింపిక్స్‌లో భారత్ తొలి పతకం : రెండో అథ్లెట్‌గా రికార్డు

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (09:53 IST)
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సొంతమైంది. అద్వితీయ పోరుతో శనివారం ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ రజతం రూపంలో దేశానికి తొలి పతకం అందించింది. 
 
మహిళల సింగిల్స్ క్లాస్ 4‌ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి ఝౌ యింగ్‌తో ఆదివారం ఉదయం జరిగిన పోరులో భవీనాబెన్ పరాజయం పాలై రజతంతో సరిపెట్టుకుంది. ఫలితంగా, టేబుల్ టెన్నిస్‌లో పతకం సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులెక్కింది.
 
మొన్న బ్రెజిల్‌కు చెందిన ఓయ్స్ డి ఒలివీరాతో జరిగిన సింగిల్స్ క్లాస్ 4 మ్యాచ్‌లో 3-0తో అద్వితీయ విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన భవీనాబెన్.. ఆ తర్వాత ప్రపంచ నంబర్ 2, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు చెందిన రాంకోవిక్‌తో జరిగిన పోరులోనూ ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. 
 
అయితే, చైనాకు చెందిన మియావో జాంగ్‌‌తో జరిగిన సెమీఫైనల్‌లో 3-2తో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఫలితంగా నిన్ననే భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి, వరల్డ్‌ నంబర్‌ వన్‌ సీడ్‌ యింగ్‌ జావోతో జరిగిన ఫైన‌ల్‌ పోరులో 3-0తో ఓటమి చెందింది. దీంతో సిల్వర్‌ మెడల్‌తో దేశానికి రానుంది. అయితే పారాలింపిక్స్‌ చరిత్రలో టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కు పతకం దక్కడం ఇదే తొలిసారి. 
 
గుజరాత్‌కి చెందిన భవీనాబెన్‌ పటేల్ పోలియో కారణంగా చక్రాల కుర్చీకి పరిమితమైంది. తొలుత ఫిట్‌‌నెస్ కోసం సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడటం ప్రారంభించిన భవీనా.. ఆ తర్వాత దానినే కెరీర్‌గా ఎంచుకుని కష్టపడింది. 
 
మొదట్లో వెనుకబడినా మధ్యలో పుంజుకోవడాన్ని బాగా అలవాటు చేసుకున్నది. మొత్తంగా పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత రెండో అథ్లెట్‌గా అరుదైన ఘనత సాధించింది. 2016లో దీపా మాలిక్ రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనకాపల్లిలో ఆరునెలల బిడ్డతో మహిళ అనుమానాస్పద మృతి.. వరకట్నం వేధింపులే..?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారీ ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి

హైదరాబాద్: గూగుల్ రోడ్డు, మెటా రోడ్డు, టీసీఎస్ రోడ్డు అని పేరు పెట్టాలి.. రేవంత్ రెడ్డి

Bihar Elections: పత్తా లేకుండా పోయిన ప్రశాంత్ కిషోర్

Hyderabad Police: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు.. భద్రతా ఏర్పాట్లు ముమ్మరం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

తర్వాతి కథనం
Show comments