Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 16న సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహం..?

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా, పారుపల్లి కశ్యప్‌లు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ ఇద్దరి వివాహం కానున్నట్లు సన్నిహితుల సమాచారం. ఈ మేరకు ఇరు కుటుంబ పెద్దలు డేట్స్ ఫిక్స్

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (11:39 IST)
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా, పారుపల్లి కశ్యప్‌లు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ ఇద్దరి వివాహం కానున్నట్లు సన్నిహితుల సమాచారం. ఈ మేరకు ఇరు కుటుంబ పెద్దలు డేట్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది డిసెంబర్ 16న వీరి వివాహం జరుగనుందని.. 21న రిసెప్షన్ జరుగనుంది.
 
అలాగే పెళ్లి కేవలం వందమంది సమక్షంలోనే జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. 2005లో బ్యాడ్మింటన్ క్రీడాకారులైన ఈ ఇద్దరు హైదరాబాద్‌లోని గోపిచంద్ అకాడమీలో కలిశారు. కొన్ని సంవత్సరాల పాటు స్నేహితులుగా వున్న వీరిద్దరూ.. ఆపై ప్రేమికులుగా మారారు. దాదాపు పది సంవత్సరాల పాటు ఈ ఇద్దరూ ప్రేమలో వున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. 
 
ఈ క్రమంలో పలుమార్లు వీరు కెమెరాలకు చిక్కినా.. ఇద్దరూ తమ మధ్య బంధాన్ని మాత్రం ఎప్పుడూ బయటపెట్టలేదు. ప్రస్తుతం తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో ముడిపెట్టి ఒక్కటవ్వనున్నారు. త్వరలో సైనా మెడలో కశ్యప్ తాళిబొట్టు కడతాడని.. వీరి వివాహ వేడుక అట్టహాసంగా జరుగనుందని సన్నిహితులు వెల్లడించారు. 
 
ఇప్పటికే 32 ఏళ్ల పారుపల్లి కశ్యప్ 2013 బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ గేమ్స్‌ (2014)లో స్వర్ణ పతకం సాధించాడు. ఇక 28 ఏళ్ల సైనా నెహ్వాల్.. 2015లో టాప్-1లో నిలిచింది. కామన్వెల్త్ 2010, 2018లో స్వర్ణపతకం సాధించింది. 2012 ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments