Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ సింధుకు కేటాయించిన భూమిపై వివాదం.. ఏంటి సంగతి?

సెల్వి
బుధవారం, 30 అక్టోబరు 2024 (10:05 IST)
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు విశాఖపట్నంలో కేటాయించిన భూమిపై వివాదం నెలకొంది. విశాఖపట్నం జిల్లా తోటగూరు ప్రాంతంలో గత ప్రభుత్వం పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ కోసం భూమిని కేటాయించింది. 
 
అయితే, స్థానిక నివాసితులు ఈ స్థలం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థలాన్ని స్పోర్ట్స్‌ అకాడమీకి కాకుండా జూనియర్‌ కళాశాలకు వినియోగించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. 
 
కళాశాలకు స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి పదే పదే విన్నవించగా, తమ డిమాండ్‌పై గట్టిగా నిలదీశారు. ఈ పరిస్థితిపై ప్రస్తుతం అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం, పీవీ సింధు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. 
 
జూన్ 2021లో, జగన్ ప్రభుత్వం బ్యాడ్మింటన్ అకాడమీ- స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణం కోసం పీవీ సింధుకు విశాఖపట్నంలో రెండు ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
చినగదిలి మండలం విశాఖ రూరల్‌లో సర్వేలో ఉన్న పశుసంవర్ధక శాఖకు చెందిన మూడెకరాల నుంచి రెండెకరాలు క్రీడా, యువజన వ్యవహారాల శాఖకు, ఒక ఎకరం ఆరోగ్యశాఖకు బదలాయిస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ.. ప్రమాణ స్వీకారంకు సర్వం సిద్ధం

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

తర్వాతి కథనం
Show comments