Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడలు : భారత మహిళా ఫుట్‌బాల్ టీమ్ శుభారంభం!

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (12:32 IST)
ఆసియా క్రీడల్లో భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు శుభారంభం చేసింది. మాల్దీవ్స్‌తో జరిగిన పూల్ మ్యాచ్‌లో 15-0 తేడాతో విజయభేరి మోగించింది. భారత్ విజృంభణకు మాల్దీవ్స్ క్రీడాకారిణుల నుంచి ఏ దశలోనూ సమాధానం లేకపోయింది.
 
మ్యాచ్ మొదలైన ఐదో నిమిషంలోనే వింగర్ సస్మిత మాలిక్ గోల్ సాధించి భారత్ ఖాతాను తెరిచింది. ఆ తర్వాత ఆమె 21, 26, 80, 88 నిమిషాల్లో మరో నాలుగు గోల్స్ చేసింది. మిడ్‌ఫీల్డర్ కమలా దేవి 18, 23, 31, 45 (+3), 65 నిమిషాల్లో మొత్తం ఐదు గోల్స్ నమోదు చేసి, సస్మితతో సమవుజ్జీగా నిలిచింది. 
 
బాలా దేవి 20, 45 (+2) రెండు గోల్స్ సాధించగా, కెప్టెన్ బెంబెమ్ దేవి, స్ట్రయికర్ ప్రమేష్వొరీ దేవి, డిఫెండర్ ఆశాలతా దేవి తలా ఒక గోల్ చేశారు. గ్రూప్ ‘ఎ’లో జరిగిన ఈ మ్యాచ్‌ని గెల్చుకున్న భారత్‌కు మూడు పాయింట్లు లభించాయి.
 
భారత మహిళలు తర్వాతి మ్యాచ్‌ని 17న దక్షిణ కొరియాతో ఆడతారు. పూల్ దశలో చివరి మ్యాచ్‌లో థాయిలాండ్‌ను 21న ఎదుర్కొంటారు. 

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments