Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి బంగారు పతకం

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (09:34 IST)
చైనాలోని హౌంగ్జౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారత్‌కు తొలి బంగారు పతకం వరించింది. పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత జట్టుకు ఈ గోల్డ్ మెడల్ లభించింది. ప్రపంచ ఛాంపియన్ రుద్రాంక్ష్ పాటిల్, ఒలింపియన్ దివ్యాన్ష్ పన్వర్, ఐశ్వరీ తోమర్‌తో కూడిన జట్టు బంగారు పతకాన్ని వొడిసి పట్టుకుంది. గోల్డ్ మెడల్ సాధించడమేకాకుండా క్వాలిఫికేషన్ రౌండ్‌లో సాధించిన పాయింట్స్ ద్వారా ప్రపంచ రికార్డును బద్ధలు కొట్టింది. 
 
క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత పురుషుల జట్టు ఏకంగా 1893.7 పాయింట్లు సాధించింది. ఈ క్రమంలో చైనా నెలకొల్పిన 1893.3పాయింట్ల రికార్డు బద్ధలైంది. అలాగే పురుషులు ఫోర్ రోయింగ్ ఈవెంట్‌లో భారత్ ఖాతాలో కాంస్య పతకం చేరింది. జస్విందర్, భీమ్, పునీత్, ఆశిష్‌లతో కూడిన జట్టు 6:10:81 సెకన్ల టైమింగ్‌ నమోదు చేసి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సాక్షి ప్రకటనల రూపంలో అడ్డుగోలుగా రూ.443 కోట్లు దోచిపెట్టారు..

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోం.. చంద్రబాబు

ఫోటో షూట్‌ల కోసం తీసుకెళ్లి.. అత్యాచారం చేసి హాస్టల్‌లో దింపాడు..

పోలవరం ప్రాజెక్టు వద్ద కొత్త డయాఫ్రమ్ వాల్.. ప్రారంభం ఎప్పుడు?

మరో ఎంపాక్స్ కేసు.. యూఏఈ నుంచి వ్యక్తికి పాజిటివ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవర సినిమాకు పోటీగా విజయ్ ఆంటోనీ యాక్షన్ థ్రిల్లర్ హిట్లర్

పవన్‌తో నా స్నేహం.. మూడు పువ్వులు - ఆరు కాయలు : హాస్య నటుడు అలీ

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

తర్వాతి కథనం
Show comments