Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుదిర్మన్ కప్: ముగిసిన భారత పోరు.. ఇంటిదారి పట్టిన ఆటగాళ్లు!

Webdunia
FILE
సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్‌డ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత పోరు ముగిసింది. ఈ టోర్నీలో భారత్ లీగ దశలోనే ఇంటిదారి పట్టింది. ఇండోనేసియాపై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు 1-4 తేడాతో ఓటమి చవిచూసి నిరాశపరిచారు. ఆదివారం చైనా చేతిలో 0-5తో ఓడిన టీమిండియా వరుసగా రెండో పరాజయంతో ఈ ఈవెంట్ నుంచి నిష్ర్కమించింది.

ఇండోనేషియాలోతో జరిగిన పోరులో పురుషుల డబుల్స్‌లో అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా జోడి 13-21, 10-21తో ప్రతమ అంగా-సపుత్రో అగుంగ్ ద్వయం పరాజయం పాలైంది. అనంతరం మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు 15-21, 10-21తో ప్రపంచ 15వ ర్యాంకర్ లిందావెని ఫనెత్రి చేతిలో ఖంగుతింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో అపర్ణ బాలన్-అరుణ్ విష్ణు జంట 13-21, 14-21తో అహ్మద్ తొంతోవి-నాత్సిర్ లిలియానా జోడి చేతిలో ఓడిపోయింది.

పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పారుపల్లి కశ్యప్ 21-18, 21-14తో రుంబాక హయోమ్‌పై గెలిచినా... అయితే నాలుగో మ్యాచ్‌లో అశ్విని పొనప్ప-ప్రద్న్యా గాద్రె జోడి 19-21, 20-22తో పోలి గ్రెసియా-మహేశ్వరి క్రిసిందా జంట చేతిలో ఓటమి చెందడంతో భారత్ పరాజయం ఖాయమైంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments